Local Parties : ప్రాంతీయ అధినేతలకు పార్లమెంట్‌ ఎన్నికల పరీక్ష.. బీజేపీని ఎదురొడ్డి నిబ‌డ‌డం క‌ష్ట‌మే..!

Advertisement
Published by
Advertisement

Local Parties  : శాంతికాలంలో యుద్ధమంటే అది ఎన్నికల సమయమే. ఒకప్పుడు, ఎన్నికల ముహూర్తాన్ని ఎంచుకోవడానికి పాలకులు హాస్యాస్పదంగా గ్రహస్థితులపై ఆధారపడేవారు. ఇందుకోసం దీర్ఘకాలంగా నమ్మకమైన జ్యోతిష్కుల సలహాలు, సూచనలు పాటించేవారు. వ్యాపారవేత్తలు, మార్కెట్‌ మావెన్లు, సైద్ధాంతిక మేధావులు వంటి ఎన్నికల పండితులు కాక్‌టెయిల్‌ పార్టీలలో లేదా టీవీలో తమ లక్ష్య ప్రేక్షకుల ఆకలిని పెంచడానికి నంబర్‌ గేమ్‌లు ఆడతారు. ఇప్పుడు కూడా 2024 లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కాగానే నేతల ఎదుగుదల, పతనం, గ్రహాల అనుకూలతలు, ప్రతికూలతలను విశ్లేషించడం, ఎవరికి అందలమో, ఎవరికి పరాజయమో లెక్కలు కట్టడం ప్రారంభిస్తారు. తమ అంచనాలతో ఆయా పార్టీల అభిమానులతోపాటు, రాజకీయా భిలాషులనూ ఉత్కంఠకు గురిచేస్తారు. లేనిపోని ఉక్కపోతలో ఉక్కిరిబిక్కిరి అయ్యేటట్లు చేస్తుంటారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎప్పటిలాగే ఈసారికూడా పరాజయ కిరీటాన్నే తగించడం ఊహించదగిన పరిణామమే. బీజేపీకి 370 సీట్లు వస్తాయని అంచనా వేసిన నరేంద్ర మోడీ ఇప్పటికే విజయాన్ని ప్రకటించుకున్నారు. మితవాద అభిప్రాయాలు, ఫోనీ పోల్‌స్టర్లు కాంగ్రెస్‌కు 50 కంటే తక్కువ ఎంపీ సీట్లు ఉస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదురొడ్డే పెద్దపార్టీ అంటూ లేకపోయిన ప్పుడూ, సాధారణంగా అందరిదృష్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన బలమైన ప్రాంతీయ పార్టీలపౖౖె ఉంటుంది.

Advertisement

బాహుబలి లాంటి బీజేపీ BJP ముందు శరణమా? మరణమా? తేల్చుకోవాల్సింది ఇక ఆయా ప్రాంతీయ పార్టీలే. 2024 ఎన్నికలు కేవలం మోడీ 3.0 మాత్రమే కాదు. మమతా బెనర్జీ, శరద్‌ పవార్‌, స్టాలిన్‌, సిద్ధరామయ్య, రేవంత్‌ రెడ్డిల ప్రాంతీయ సిద్ధాంతాలు రాజకీయ శాశ్వతత్వానికి సంబంధించినవి. యాదవ వారసులు అఖిలేష్‌, తేజస్వి తమ రాష్ట్రాలలో గెలుపుకోసం ఆపసోపాలు పడుతున్నారు. ప్రధాన మంత్రులను తయారు చేయడంలో ముఖ్యమైన పాత్రలు పోషించిన తమ తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది. గద్దను బుల్‌ఫించ్‌ దెబ్బతీసినట్లే ఉత్తర భారతదేశంలో బిజెపిని ప్రత్యక్ష పోరులో కాంగ్రెస్‌ దెబ్బతీసే అవకాశం ఉంది. యూపీ, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్‌, పంజాబ్‌, ఢిల్లిd ఫలితాలపై లోక్‌సభలో జాతీయ పార్టీల మెజారిటీ ఆధారపడి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో 348 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం బీజేపీకి 169, ఇండియా కూటమి దాని మిత్రపక్షాలకు 126 సీట్లు ఉన్నాయి. మిగిలిన స్థానాలలో వామపక్షాలు, ఇతర చిన్నపార్టీల తరఫున ఎంపీలున్నారు.

Advertisement

Local Parties  : 2024 రాజకీయ కాసినో ముఖచిత్రం

ఒకప్పుడు యూపీలో 36 లోక్‌సభ స్థానాలు, దాదాపు 60 శాతం అసెంబ్లిd సీట్లను గెలుచుకున్న 50 ఏళ్ల మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ భవిష్యత్తును ఇప్పుడు జరగబోయే ఎన్నికలు నిర్ణయించనున్నాయి. 2012లో, అఖిలేష్‌ రాష్ట్ర ఎన్నికలలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడిపోయారు. చివరకు 2019లో కేవలం ఐదు అసెంబ్లిd స్థానాల్లో గెలిచిన మాయావతితో పొత్తు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పుడు అతను రాహుల్‌తో జతకట్టాడు. రాష్ట్రంలోని 80 స్థానాల్లో 100 శాతం విజయం సాధిస్తామని మోడీ, యోగి ప్రగల్భాలు పలుకుతున్నారు. మరోవైపు మాయావతి ఒంటరిపోరును ప్రకటించారు.ఇక బీహార్‌ విషయానికొస్తే ఇక్కడ 40 లోక్‌సభ స్థానాలున్నాయి. 34 ఏళ్ల మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌, ఒక దశాబ్దం పాటు బీహార్‌పై ఆధిపత్యం వ#హంచిన తండ్రి లాలూ యాదవ్‌కు తగిన వారసుడిగా సూర్యాస్తమయంలోకి వెళ్లవచ్చు లేదా సింహాసనాన్ని అధిరోహంచవచ్చు. ప్రస్తుతం, అతని రాష్ట్రీయ జనతాదళ్‌ లోక్‌సభలో సున్నా మరియు, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్‌ ఒక సీటును మాత్రమే కలిగివున్నాయి. మిగిలిన 39 సీట్లు నీతీష్‌, బీజేపీ ఖాతాలో ఉన్నాయి. నితీష్‌ తన విశ్వసనీయతను కోల్పోయినందున, జూనియర్‌ యాదవ్‌కు ఆ స్థలాన్ని పట్టుకుని జాతీయ ఆటగాడిగా మారే అవకాశం ఉంది. మోడీ సంఖ్యను ప్రభావితం చేయడంలో ఆయన పలుకుబడి ఈసారి పరీక్షించబడుతుంది.

మహారాష్ట్రలో 48 స్థానాలు ఉన్నాయి. శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రేలు భవిష్యత్తు ఔచిత్యాన్ని నిర్ణయిస్తారు. ఇద్దరూ జాతీయస్థాయి నేతలే. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న వారు ఇటీవల సొంతపార్టీ నేతల ఫిరాయింపులతో తమ సొంత పార్టీపై హక్కులే కోల్పోయారు. వారు తమ కేడర్‌, సంస్థాగత మద్దతును నిలుపుకోగలరా లేదా అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. 2019లో బీజేపీ-సేన కూటమికి వ్యతిరేకంగా పవార్‌ కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. శివసేనకు 18 సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. శివసేన నుంచి షిండే సేన వేరయింది. అలాగే శరద్‌ పవార్‌ గ్రూపు నుంచి అజిత్‌ వర్గం కూడా వేరుపడింది. ఈ రెండు పార్టీల బలం రెండు కొత్త పార్టీలుగా మారింది. అయితే ఈ లోక్‌సభ పోరాటంలో చీలికవర్గానికి చెక్‌ పెట్టేలా ప్రజాదరణ తిరిగి పొందుతారా లేదా అన్నదే కీలకం. సాంప్రదాయ ఓటు బ్యాంకును మళ్లిd పునరుద్ధరించుకో గలిగితేనే వీరికి రాజకీయ భవిష్యత్‌ ఉంటుంది. లేదంటే ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు.ఇక పశ్చిమ బెంగాల్‌ విషయానికొస్తే, మమతా బెనర్జీ వర్సెస్‌ మోడీకి ప్రతిష్టాత్మక పోరుకు ఈ రాష్ట్రం వేదికవుతోంది. 2019లో బీజేపీ 18 సీట్లు, ఆ తర్వాత అసెంబ్లిలో 77 సీట్లు గెలుచుకోవడం ద్వారా టీఎంసీకి నిర్ణయాత్మక నష్టం కలిగించింది. తన టార్గెట్‌ 370 సాధించేందుకు బెంగాల్‌ నుంచి 35 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న మోడీ, అందుకోసం రెండేళ్లుగా పశ్చిమ బెంగాల్‌పై దృష్టిసారించారు. ‘జమీందార్లు’గా పిలుచుకునే బీజేపీని పశ్చిమ బెంగాల్‌ నుంచి తరిమికొడతామని మమత ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞను ఆమె ఏమేరకు నెరవేర్చుకుంటారో చూడాలి. ఇక్కడ ఇండియా కూటమిలో కీలక పార్టీలైన కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ను ఆమె దూరం పెట్టారు. దీంతో ఓట్ల చీలిక అనివార్యం. ఈ ప్రభావం కాషాయపార్టీకి మేలు చేస్తుందా? టీఎంసీకి మేలు చేస్తుందా అన్నదానిపై విశ్లేషకులే ఒక అంచనాకు రాలేక పోతున్నారు. ఏదేమైనా బెంగాల్‌ రాజకీయం ఈ ఎన్నికల తర్వాత కొత్త మలుపు తీసుకోవడం ఖాయమని చెబుతున్నారు.

Advertisement

Recent Posts

Ys Jagan : ఒక్కసారి గా పెరిగిన వైసీపీ ఓటు షేర్ ? జగన్ ఫుల్ హ్యాపీ..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…

2 hours ago

Tomahawk : తోమహాక్ పేరు వింటేనే అమెరికా వణికిపోతోంది.. అంటే ఏంటి.. ఎందుకంత భయం..!

Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…

3 hours ago

Pawan Kalyan : వైసీపీకి మళ్ళీ అధికారం… పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…

4 hours ago

Raghava Mining : రాఘవ మైనింగ్స్ తో దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ… Full Details..!

Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…

5 hours ago

Amaravati : అమరావతి చట్టబద్ధత వెనక అతిపెద్ద డ్రామా..?

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…

8 hours ago

New COVID Variant : వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్, లాక్ డౌన్ తప్పదా..?

New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…

9 hours ago

Chicken Price Drop : చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన ధరలు.. కానీ ఏప్రిల్ 1 నుంచి షాక్!

Chicken Price Drop : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా…

13 hours ago

Gold Silver Rate 29th March 2026 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే రూ.2500 జంప్!

Gold Silver Rate 29th March 2026 : బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు ఇది నిజంగా షాకింగ్…

13 hours ago

pachhi chintapandu rasam recipe : నోరూరించే చింతపండు రసం .. ఇలా ఇలా చేస్తే ప్రతిరోజు అదే కావాలంటారు ..!

pachhi chintapandu rasam recipe : పచ్చి చింతకాయలతో తయారుచేసే రసం అనేది మన తెలుగు ఇంటి వంటల్లో ఒక…

15 hours ago

Coffee On Empty Stomach : ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా? .. అయితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ?

Coffee On Empty Stomach : చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా…

16 hours ago

Health : ఇది పిచ్చి మొక్క కాదు .. సంజీవనితో సమానం .. వంద అనారోగ్య సమస్యలకు చెక్..!

Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…

17 hours ago