Local Parties : ప్రాంతీయ అధినేతలకు పార్లమెంట్‌ ఎన్నికల పరీక్ష.. బీజేపీని ఎదురొడ్డి నిబ‌డ‌డం క‌ష్ట‌మే..!

Local Parties  : శాంతికాలంలో యుద్ధమంటే అది ఎన్నికల సమయమే. ఒకప్పుడు, ఎన్నికల ముహూర్తాన్ని ఎంచుకోవడానికి పాలకులు హాస్యాస్పదంగా గ్రహస్థితులపై ఆధారపడేవారు. ఇందుకోసం దీర్ఘకాలంగా నమ్మకమైన జ్యోతిష్కుల సలహాలు, సూచనలు పాటించేవారు. వ్యాపారవేత్తలు, మార్కెట్‌ మావెన్లు, సైద్ధాంతిక మేధావులు వంటి ఎన్నికల పండితులు కాక్‌టెయిల్‌ పార్టీలలో లేదా టీవీలో తమ లక్ష్య ప్రేక్షకుల ఆకలిని పెంచడానికి నంబర్‌ గేమ్‌లు ఆడతారు. ఇప్పుడు కూడా 2024 లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కాగానే నేతల ఎదుగుదల, పతనం, గ్రహాల అనుకూలతలు, ప్రతికూలతలను విశ్లేషించడం, ఎవరికి అందలమో, ఎవరికి పరాజయమో లెక్కలు కట్టడం ప్రారంభిస్తారు. తమ అంచనాలతో ఆయా పార్టీల అభిమానులతోపాటు, రాజకీయా భిలాషులనూ ఉత్కంఠకు గురిచేస్తారు. లేనిపోని ఉక్కపోతలో ఉక్కిరిబిక్కిరి అయ్యేటట్లు చేస్తుంటారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎప్పటిలాగే ఈసారికూడా పరాజయ కిరీటాన్నే తగించడం ఊహించదగిన పరిణామమే. బీజేపీకి 370 సీట్లు వస్తాయని అంచనా వేసిన నరేంద్ర మోడీ ఇప్పటికే విజయాన్ని ప్రకటించుకున్నారు. మితవాద అభిప్రాయాలు, ఫోనీ పోల్‌స్టర్లు కాంగ్రెస్‌కు 50 కంటే తక్కువ ఎంపీ సీట్లు ఉస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదురొడ్డే పెద్దపార్టీ అంటూ లేకపోయిన ప్పుడూ, సాధారణంగా అందరిదృష్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన బలమైన ప్రాంతీయ పార్టీలపౖౖె ఉంటుంది.

బాహుబలి లాంటి బీజేపీ BJP ముందు శరణమా? మరణమా? తేల్చుకోవాల్సింది ఇక ఆయా ప్రాంతీయ పార్టీలే. 2024 ఎన్నికలు కేవలం మోడీ 3.0 మాత్రమే కాదు. మమతా బెనర్జీ, శరద్‌ పవార్‌, స్టాలిన్‌, సిద్ధరామయ్య, రేవంత్‌ రెడ్డిల ప్రాంతీయ సిద్ధాంతాలు రాజకీయ శాశ్వతత్వానికి సంబంధించినవి. యాదవ వారసులు అఖిలేష్‌, తేజస్వి తమ రాష్ట్రాలలో గెలుపుకోసం ఆపసోపాలు పడుతున్నారు. ప్రధాన మంత్రులను తయారు చేయడంలో ముఖ్యమైన పాత్రలు పోషించిన తమ తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది. గద్దను బుల్‌ఫించ్‌ దెబ్బతీసినట్లే ఉత్తర భారతదేశంలో బిజెపిని ప్రత్యక్ష పోరులో కాంగ్రెస్‌ దెబ్బతీసే అవకాశం ఉంది. యూపీ, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్‌, పంజాబ్‌, ఢిల్లిd ఫలితాలపై లోక్‌సభలో జాతీయ పార్టీల మెజారిటీ ఆధారపడి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో 348 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం బీజేపీకి 169, ఇండియా కూటమి దాని మిత్రపక్షాలకు 126 సీట్లు ఉన్నాయి. మిగిలిన స్థానాలలో వామపక్షాలు, ఇతర చిన్నపార్టీల తరఫున ఎంపీలున్నారు.

Local Parties  : 2024 రాజకీయ కాసినో ముఖచిత్రం

ఒకప్పుడు యూపీలో 36 లోక్‌సభ స్థానాలు, దాదాపు 60 శాతం అసెంబ్లిd సీట్లను గెలుచుకున్న 50 ఏళ్ల మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ భవిష్యత్తును ఇప్పుడు జరగబోయే ఎన్నికలు నిర్ణయించనున్నాయి. 2012లో, అఖిలేష్‌ రాష్ట్ర ఎన్నికలలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడిపోయారు. చివరకు 2019లో కేవలం ఐదు అసెంబ్లిd స్థానాల్లో గెలిచిన మాయావతితో పొత్తు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పుడు అతను రాహుల్‌తో జతకట్టాడు. రాష్ట్రంలోని 80 స్థానాల్లో 100 శాతం విజయం సాధిస్తామని మోడీ, యోగి ప్రగల్భాలు పలుకుతున్నారు. మరోవైపు మాయావతి ఒంటరిపోరును ప్రకటించారు.ఇక బీహార్‌ విషయానికొస్తే ఇక్కడ 40 లోక్‌సభ స్థానాలున్నాయి. 34 ఏళ్ల మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌, ఒక దశాబ్దం పాటు బీహార్‌పై ఆధిపత్యం వ#హంచిన తండ్రి లాలూ యాదవ్‌కు తగిన వారసుడిగా సూర్యాస్తమయంలోకి వెళ్లవచ్చు లేదా సింహాసనాన్ని అధిరోహంచవచ్చు. ప్రస్తుతం, అతని రాష్ట్రీయ జనతాదళ్‌ లోక్‌సభలో సున్నా మరియు, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్‌ ఒక సీటును మాత్రమే కలిగివున్నాయి. మిగిలిన 39 సీట్లు నీతీష్‌, బీజేపీ ఖాతాలో ఉన్నాయి. నితీష్‌ తన విశ్వసనీయతను కోల్పోయినందున, జూనియర్‌ యాదవ్‌కు ఆ స్థలాన్ని పట్టుకుని జాతీయ ఆటగాడిగా మారే అవకాశం ఉంది. మోడీ సంఖ్యను ప్రభావితం చేయడంలో ఆయన పలుకుబడి ఈసారి పరీక్షించబడుతుంది.

మహారాష్ట్రలో 48 స్థానాలు ఉన్నాయి. శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రేలు భవిష్యత్తు ఔచిత్యాన్ని నిర్ణయిస్తారు. ఇద్దరూ జాతీయస్థాయి నేతలే. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న వారు ఇటీవల సొంతపార్టీ నేతల ఫిరాయింపులతో తమ సొంత పార్టీపై హక్కులే కోల్పోయారు. వారు తమ కేడర్‌, సంస్థాగత మద్దతును నిలుపుకోగలరా లేదా అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. 2019లో బీజేపీ-సేన కూటమికి వ్యతిరేకంగా పవార్‌ కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. శివసేనకు 18 సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. శివసేన నుంచి షిండే సేన వేరయింది. అలాగే శరద్‌ పవార్‌ గ్రూపు నుంచి అజిత్‌ వర్గం కూడా వేరుపడింది. ఈ రెండు పార్టీల బలం రెండు కొత్త పార్టీలుగా మారింది. అయితే ఈ లోక్‌సభ పోరాటంలో చీలికవర్గానికి చెక్‌ పెట్టేలా ప్రజాదరణ తిరిగి పొందుతారా లేదా అన్నదే కీలకం. సాంప్రదాయ ఓటు బ్యాంకును మళ్లిd పునరుద్ధరించుకో గలిగితేనే వీరికి రాజకీయ భవిష్యత్‌ ఉంటుంది. లేదంటే ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు.ఇక పశ్చిమ బెంగాల్‌ విషయానికొస్తే, మమతా బెనర్జీ వర్సెస్‌ మోడీకి ప్రతిష్టాత్మక పోరుకు ఈ రాష్ట్రం వేదికవుతోంది. 2019లో బీజేపీ 18 సీట్లు, ఆ తర్వాత అసెంబ్లిలో 77 సీట్లు గెలుచుకోవడం ద్వారా టీఎంసీకి నిర్ణయాత్మక నష్టం కలిగించింది. తన టార్గెట్‌ 370 సాధించేందుకు బెంగాల్‌ నుంచి 35 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న మోడీ, అందుకోసం రెండేళ్లుగా పశ్చిమ బెంగాల్‌పై దృష్టిసారించారు. ‘జమీందార్లు’గా పిలుచుకునే బీజేపీని పశ్చిమ బెంగాల్‌ నుంచి తరిమికొడతామని మమత ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞను ఆమె ఏమేరకు నెరవేర్చుకుంటారో చూడాలి. ఇక్కడ ఇండియా కూటమిలో కీలక పార్టీలైన కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ను ఆమె దూరం పెట్టారు. దీంతో ఓట్ల చీలిక అనివార్యం. ఈ ప్రభావం కాషాయపార్టీకి మేలు చేస్తుందా? టీఎంసీకి మేలు చేస్తుందా అన్నదానిపై విశ్లేషకులే ఒక అంచనాకు రాలేక పోతున్నారు. ఏదేమైనా బెంగాల్‌ రాజకీయం ఈ ఎన్నికల తర్వాత కొత్త మలుపు తీసుకోవడం ఖాయమని చెబుతున్నారు.

Recent Posts

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

45 minutes ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

2 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

4 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

5 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

6 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

7 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

8 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

9 hours ago