Modi : జగన్ ను టార్గెట్ చేస్తున్న మోడీ.. ఎందుకీ మార్పు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Modi : జగన్ ను టార్గెట్ చేస్తున్న మోడీ.. ఎందుకీ మార్పు..?

 Authored By ramu | The Telugu News | Updated on :9 May 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Modi : జగన్ ను టార్గెట్ చేస్తున్న మోడీ.. ఎందుకీ మార్పు..?

Modi : ప్రధాని నరేంద్ర మోడీకి, జగన్ కు ఇప్పటి వరకు పెద్దగా పొరపొచ్చాలు లేవు. ఇప్పటి వరకు జగన్ మోడీని ఏమీ అనలేదు. అటు మోడీ కూడా ఎన్నడూ వైసీపీ ప్రభుత్వాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు టీడీపీతో ఏపీలోకూటమిగా ఏర్పడ్డ బీజేపీ ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేస్తోంది. ఇక మోడీ అయితే స్వయంగా జగన్ మీద ఫైర్ అవుతున్నారు. జూన్ 4వ తేదీ జగన్ ప్రభుత్వానికి ఆఖరు రోజు అని తేల్చేస్తున్నారు. జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని.. వారు మార్పు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ. దాంతో ఇప్పుడు అందరి దృష్టి మోడీపై పడింది.

Modi : వారిద్దరూ ఒక్కటే అంటూ..

మోడీ ఇంతకు ముందు కూడా ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. కానీ ఇంతలా ఒక ప్రభుత్వానికి డెడ్ లైన్ అయితే అస్సలు పెట్టలేదు. మొన్న చిలకలూరిపేటకు వచ్చినప్పుడు కూడా జగన్ పేరెత్తలేదు. కానీ 6, 7వ తేదీన మాత్రం ఏపీలో జగన్ మీద విమర్శలు గుప్పించారు. వైసీపీకి కాంగ్రెస్ లక్షణాలు ఉన్నాయన్నారు. అందుకే వారు ఏపీలో కుటిలత్వాన్ని, నిరంకుశత్వాన్ని, అవినీతిని పెంచి పోషిస్తున్నారంటూ విమర్శించారు మోడీ. అయితే జగన్ మీద ఇంతగా కామెంట్లు చేయడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు.ఆమె నిత్యం మోడీని టార్గెట్ చేస్తున్నారు. ఆమె విభజన హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అంతే కాకుండా స్టీల్ ప్లాంట్ గురించి, ప్రత్యేక హోదా గురించి నిత్యం నిలదీస్తున్నారు.

Modi జగన్ ను టార్గెట్ చేస్తున్న మోడీ ఎందుకీ మార్పు

Modi : జగన్ ను టార్గెట్ చేస్తున్న మోడీ.. ఎందుకీ మార్పు..?

దాంతో షర్మిల విమర్శలు బీజేపీకి ఇబ్బందిగా మారాయి. అందుకే మోడీ వచ్చి షర్మిల, జగన్ ఒక్కటే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో పాటు జగన్ విశ్వసనీయతపై కూడా మోడీకి అనుమానం ఉంది. ఒకవేళ కేంద్రంలో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోతే జగన్ ఇండియా కూటమికి మద్దతిస్తాడేమో అని మోడీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.మోడీ తనకు అనుకూలంగా లేకపోతే ఎవరినైనా టార్గెట్ చేస్తుంటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు జగన్ ను ఇంతగా టార్గెట్ చేయడమే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడు మోడీకి, జగన్ కు గ్యాప్ వచ్చేసింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది