Categories: ExclusiveNationalNews

PM Kisan Yojana : పీఎం కిసాన్ యోజన పథకం అప్ డేట్…17వ విడత ఎప్పుడు విడుదల చేస్తారంటే…!

PM Kisan Yojana : భారతదేశంలోని రైతులందరికీ లబ్ధి చేకూరే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం పీఎం కిసాన్ యోజన. అయితే ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఇక ఈ పథకం 2019 ఫిబ్రవరిలో అమలులోకి తీసుకురాగా అప్పటినుండి ఇప్పటివరకు ఏడాదికి 6000 రూపాయలు చొప్పున ప్రతి రైతుకు పంటసాయంగా ఇస్తున్నారు. అయితే ఈ పథకం ద్వారా రైతులకు ఇచ్చే ఈ 6000 రూపాయలను మొత్తం మూడు విడతలలో రైతుల బ్యాంకు ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తూ వస్తోంది. ఏప్రిల్ – జూలై ,ఆగస్టు – నవంబర్ , డిసెంబర్ – మర్చి సమయంలో 2000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది.

అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించి 16వ విడత నిధులు ప్రధాని మోడీ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయబడింది. అయితే ఈ పథకంలో భాగంగా మొత్తం దేశంలో 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.అయితే షెడ్యూల్ ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పీఎం కిసాన్ నిధులను విడుదల చేయడం జరుగుతుంది. దీంతో ప్రస్తుతం రైతుల దృష్టి మొత్తం 17వ విడత నిధుల విడుదలపై ఉంది అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం ఈ నిధులు ఎప్పుడు విడుదలవుతాయనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.అయితే పీఎం కిసాన్ నిధుల విడుదల అనేది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చేస్తారు. కాబట్టి ఫిబ్రవరి నుంచి చూసుకున్నట్లయితే జూన్ నెలలో 17వ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఎలక్షన్ కూడా అమలులో ఉండటం వలన పీఎం కిసాన్ పథకం నుండి వచ్చే నిధులు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

PM Kisan Yojana : పీఎం కిసాన్ యోజన పథకం అప్ డేట్…17వ విడత ఎప్పుడు విడుదల చేస్తారంటే…!

ఇది ఇలా ఉండగా పీఎం కిసాన్ 16వ విడత డబ్బు అర్హులైన రైతులకు జమ కాలేదంటే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. దానికోసం పీఎం కిసాన్ సమ్మాన్ హెల్ప్ లైన్ నెంబర్ 011-24300606 కు ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పీఎం కిసాన్ యోజన నగదు పొందాలంటే రైతులు కచ్చితంగా ఈ-కేవైసీ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ-కేవైసీ పూర్తిచేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకం ద్వారా నగదు ఖాతాలో పడుతుంది. ఈ-కేవైసీ పూర్తి చేయనివారు ఆన్ లైన్ విధానంలో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే మీ బ్యాంకు ఖాతాను కూడా ఆధార్ తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 పనులు పూర్తి చేయకపోతే పీఎం కిసాన్ 16వ విడత డబ్బు మీ ఖాతాలోకి జమ కాదు. కాబట్టి అర్హులైన రైతులందరూ వెంటనే ఈ-కేవైసి పూర్తి చేయడం మంచిది.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago