Categories: ExclusiveNationalNews

Weather Report : ఈ సారి ముందుగానే రానున్న నైరుతి రుతుప‌వ‌నాలు.. సాధారణం కంటే ఎక్కువ వర్షాలు..!

Advertisement
Advertisement

Weather Report : తెలుగు రాష్ట్రాల‌లో కొద్ది రోజులుగా ఎండ‌లు దంచుతున్నాయి. ఈ స‌మ‌యంలో చల్లని కబురు ఇది. మరో నాలుగైదు రోజుల్లో మేఘ సందేశం రానుంది. ఎండ వేడితో, ఉక్కపోతతో ఉస్సూరుమంటున్న ప్రజలని నైరుతి రుతుపవనాలు ప‌ల‌కరించ‌బోతున్నాయి.. విపరీతమైన ఎండలు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి పలకరిస్తుందంటోంది. ఈనెల 19వ తేదీన అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతు పవనాలు తాకుతుంద‌ని అంటున్నారు.మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది.

Advertisement

Weather Report చ‌ల్ల‌ని వార్త‌..

లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు-సెప్టెంబరు కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని తెలిపింది. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌లో విత్తనాలు వేసే జూన్‌, జులై నెలలు చాలా కీలకమని సంబంధిత శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర అన్నారు. భారత వాతవరణ శాఖ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. మొదటిసారి ముందుగా 1918లో మే 11నే ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్​ 18న ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్​8న, 2022లో మే 29న, 2021లో జూన్​ 3న, 2020లో జూన్​1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి తాకాయి.

Advertisement

Weather Report : ఈ సారి ముందుగానే రానున్న నైరుతి రుతుప‌వ‌నాలు.. సాధారణం కంటే ఎక్కువ వర్షాలు..!

ఈ ఏడాది సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల సగటు LPAతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. వచ్చే సీజన్‌లో LPA 87 సెంటీమీటర్లగా అంచనా వేసింది. లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఆగస్టు- సెప్టెంబరు నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని, వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఉంటుందంటున్నారు నిపుణులు.

Recent Posts

Mouni Amavasya : మౌని అమావాస్య ప్రాముఖ్యత : ఈ పవిత్ర రోజున పాటించాల్సిన నియమాలు, చేయవలసిన పూజలు..!

Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…

32 minutes ago

Zodiac Signs January 18 2026 : జ‌న‌వ‌రి 18 ఆదివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…

2 hours ago

Kavitha : సిద్దిపేట ఎమ్మెల్యేగా క‌విత‌… ఏం జ‌రుగుతుంది..?

Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…

10 hours ago

Mana Shankara Vara Prasad Garu Movie : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’.. 5 రోజుల్లో రూ.226 కోట్ల గ్రాస్

Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…

11 hours ago

Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీలో కోట్ల మౌనం.. పార్టీపై అసంతృప్తితో ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ?

Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…

12 hours ago

Smart TV : రూ.7,499కే 32 అంగుళాల స్మార్ట్ టీవీ..! తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్లు – నెటిజన్లను ఆకట్టుకుంటున్న డీల్

Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…

15 hours ago

Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో రాజకీయ వేడి .. జేసీ పాలనపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్

Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…

16 hours ago

Medaram Jatara 2026 : మేడారం జాతరలో కొత్త ట్రెండ్‌ : చలిని క్యాష్ చేసుకుంటున్న వేడి నీళ్ల బిజినెస్!

Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…

17 hours ago