Categories: ExclusiveNationalNews

BJP : కనిపించని అయోధ్య ప్రభావం.. క‌మ‌లం మెజార్టీ సీట్లు తగ్గడానికి అసలు కారణాలేంటి..?

Advertisement
Advertisement

BJP : దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో 240 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ బీజేపీలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. సొంతంగా 370 పైన స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్న బీజేపీకి ఈ ఫలితాలు అసంతృప్తిని మిగిల్చాయని చెప్పొచ్చు. మరోవైపు బీజేపీతో జతకట్టి గెలుపొందిన భాగస్వామ్య పక్షాలు మాత్రం సంతోషంగానే కనిపిస్తున్నట్లు అర్థమవుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషించవచ్చనే ఆలోచనలతో ఉన్నాయి. అయితే ఈ పదేళ్లు చూసిన బీజేపీ ప్రభుత్వం ఒకెత్తయితే.. ఇకపై చూడబోయే సంకీర్ణ ప్రభుత్వం మరో ఎత్తు అన్నట్టుగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ బీజేపీ ఈ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవడానికి కారణాలేంటో కొన్నింటిని విశ్లేషిస్తే.

Advertisement

ప్రభుత్వంపై వ్యతిరేకత..

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఎంత మంచి పాలన అందించినా ప్రజల్లో ప్రభుత్వంపై ఆశలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. మొత్తంగా ఎంతో కొంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బీజేపీ వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడంతో వ్యతిరేకత సహజంగానే ఉంటుంది. ఈసారి లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యతిరేకత ఉందని బీజేపీ గుర్తించినప్పటికీ.. దాని తీవ్రతను మాత్రం పూర్తిగా అంచనా వేయలేకపోయారని స్పష్టమవుతోంది. కోవిడ్ మహమ్మారితో పాటు ఉక్రెయిన్-రష్యాలు, పాలస్తీనా – ఇజ్రాయిల్ మధ్య జరిగిన యుద్ధాల వంటివి యావత్ ప్రపంచంపైనే ప్రభావం చూపి అనేక అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఆర్థిక వ్యవస్థ సంక్షోభాలు తలెత్తినప్పటికీ ఇండియా ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలకడగానే ముందుకు సాగింది. కానీ ఈ క్రమంలో ధరలు, నిరుద్యోగం పెరగడం జరిగింది. దీనికి తోడు పెట్రోల్, గ్యాస్, రైళ్లలో వృద్ధులకు ఇస్తున్న రాయితీలు, సబ్సిడీలు ఆగిపోయాయి. ఇలాంటి అంశాల కారణంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ఇవేకాకుండా మరికొన్ని అంశాలు జత కలిసి ఫలితాలపై ప్రభావం చూపాయి.

Advertisement

హిందువుల చిరకాల వాంఛ తీర్చినా..

ఉత్తర ప్రదేశ్ లో అయోధ్య రామాలయం నిర్మించి హిందువుల చిరకాల వాంఛ తీర్చి నా ప్రజల నుంచి పెద్దగా మద్దతు దక్కలేదు. హిందువులంతా ఏకమై ఓటేస్తారని భావించినప్పటికీ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోనే బీజేపీ ఓటమి చవిచూసింది.

దక్షిణాదిన ఓట్లు పెరిగినా..

ఈసారి దక్షిణాదిన కచ్చితంగా పెద్ద సంఖ్యలో స్థానాలు సాధిస్తామని బీజేపీ అగ్రనేతలు ఆశించినప్పటికీ ఓట్లు పెరిగాయి కానీ సీట్లు ఆశించినంత పెరగలేదు. ఏపీలో మిత్రపక్షంతో కలిసి 6 చోట్ల పోటీ చేసి 3 స్థానాల్లో విజయం సాధించింది. తమిళనాడులో ఓట్లు పుంజుకున్నప్పటికీ.. అవి గెలిపించలేకపోయాయి. కేరళలో ఎట్టకేలకు ఖాతా తెరిచి ఒక స్థానంలో విజయం సాధించింది. కర్ణాటకలో జేడీ(ఎస్)తో కలిసి పోటీ చేసి పరువు నిలబెట్టుకుంది. అయినప్పటికీ 2019 లోక్ సభ ఎన్నికలతో పోల్చితే స్థానాలు తగ్గాయి. అన్నింటికన్నా తెలంగాణ కమలనాథులకు ఊరటనిచ్చింది. ఇక్కడ ఎనిమిది చోట్ల గెలుపొందింది.

BJP : కనిపించని అయోధ్య ప్రభావం.. క‌మ‌లం మెజార్టీ సీట్లు తగ్గడానికి అసలు కారణాలేంటి..?

ఇండియా కూటమి పుంజుకోవడంతో..

మోదీని గద్దె దించడమే లక్ష్యంగా కలిసి పనిచేసిన విపక్ష పార్టీల ఐక్యత చాలా రాష్ట్రాల్లో వారికి కలిసొచ్చిందనే చెప్పవచ్చు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ , పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, కేరళలో కమ్యూనిస్టులు ఇండియా కూటమితో సంబంధం లేకుండా విడిగా పోటీ చేసినా .. మొత్తంగా వారి మద్దతు ఇండియా కూటమికే ఉండడంతో కూటమి బలం గతం కంటే బాగానే పెరిగింది. ఇంకా చెప్పాలంటే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో ఉన్న రెండు ప్రధాన పార్టీలను తమవైపు తిప్పుకుంటే ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది ఇండియా కూటమి.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

1 hour ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.