Categories: ExclusiveNationalNews

BJP : కనిపించని అయోధ్య ప్రభావం.. క‌మ‌లం మెజార్టీ సీట్లు తగ్గడానికి అసలు కారణాలేంటి..?

BJP : దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో 240 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ బీజేపీలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. సొంతంగా 370 పైన స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్న బీజేపీకి ఈ ఫలితాలు అసంతృప్తిని మిగిల్చాయని చెప్పొచ్చు. మరోవైపు బీజేపీతో జతకట్టి గెలుపొందిన భాగస్వామ్య పక్షాలు మాత్రం సంతోషంగానే కనిపిస్తున్నట్లు అర్థమవుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషించవచ్చనే ఆలోచనలతో ఉన్నాయి. అయితే ఈ పదేళ్లు చూసిన బీజేపీ ప్రభుత్వం ఒకెత్తయితే.. ఇకపై చూడబోయే సంకీర్ణ ప్రభుత్వం మరో ఎత్తు అన్నట్టుగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ బీజేపీ ఈ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవడానికి కారణాలేంటో కొన్నింటిని విశ్లేషిస్తే.

ప్రభుత్వంపై వ్యతిరేకత..

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఎంత మంచి పాలన అందించినా ప్రజల్లో ప్రభుత్వంపై ఆశలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. మొత్తంగా ఎంతో కొంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బీజేపీ వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడంతో వ్యతిరేకత సహజంగానే ఉంటుంది. ఈసారి లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యతిరేకత ఉందని బీజేపీ గుర్తించినప్పటికీ.. దాని తీవ్రతను మాత్రం పూర్తిగా అంచనా వేయలేకపోయారని స్పష్టమవుతోంది. కోవిడ్ మహమ్మారితో పాటు ఉక్రెయిన్-రష్యాలు, పాలస్తీనా – ఇజ్రాయిల్ మధ్య జరిగిన యుద్ధాల వంటివి యావత్ ప్రపంచంపైనే ప్రభావం చూపి అనేక అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఆర్థిక వ్యవస్థ సంక్షోభాలు తలెత్తినప్పటికీ ఇండియా ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలకడగానే ముందుకు సాగింది. కానీ ఈ క్రమంలో ధరలు, నిరుద్యోగం పెరగడం జరిగింది. దీనికి తోడు పెట్రోల్, గ్యాస్, రైళ్లలో వృద్ధులకు ఇస్తున్న రాయితీలు, సబ్సిడీలు ఆగిపోయాయి. ఇలాంటి అంశాల కారణంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ఇవేకాకుండా మరికొన్ని అంశాలు జత కలిసి ఫలితాలపై ప్రభావం చూపాయి.

హిందువుల చిరకాల వాంఛ తీర్చినా..

ఉత్తర ప్రదేశ్ లో అయోధ్య రామాలయం నిర్మించి హిందువుల చిరకాల వాంఛ తీర్చి నా ప్రజల నుంచి పెద్దగా మద్దతు దక్కలేదు. హిందువులంతా ఏకమై ఓటేస్తారని భావించినప్పటికీ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోనే బీజేపీ ఓటమి చవిచూసింది.

దక్షిణాదిన ఓట్లు పెరిగినా..

ఈసారి దక్షిణాదిన కచ్చితంగా పెద్ద సంఖ్యలో స్థానాలు సాధిస్తామని బీజేపీ అగ్రనేతలు ఆశించినప్పటికీ ఓట్లు పెరిగాయి కానీ సీట్లు ఆశించినంత పెరగలేదు. ఏపీలో మిత్రపక్షంతో కలిసి 6 చోట్ల పోటీ చేసి 3 స్థానాల్లో విజయం సాధించింది. తమిళనాడులో ఓట్లు పుంజుకున్నప్పటికీ.. అవి గెలిపించలేకపోయాయి. కేరళలో ఎట్టకేలకు ఖాతా తెరిచి ఒక స్థానంలో విజయం సాధించింది. కర్ణాటకలో జేడీ(ఎస్)తో కలిసి పోటీ చేసి పరువు నిలబెట్టుకుంది. అయినప్పటికీ 2019 లోక్ సభ ఎన్నికలతో పోల్చితే స్థానాలు తగ్గాయి. అన్నింటికన్నా తెలంగాణ కమలనాథులకు ఊరటనిచ్చింది. ఇక్కడ ఎనిమిది చోట్ల గెలుపొందింది.

BJP : కనిపించని అయోధ్య ప్రభావం.. క‌మ‌లం మెజార్టీ సీట్లు తగ్గడానికి అసలు కారణాలేంటి..?

ఇండియా కూటమి పుంజుకోవడంతో..

మోదీని గద్దె దించడమే లక్ష్యంగా కలిసి పనిచేసిన విపక్ష పార్టీల ఐక్యత చాలా రాష్ట్రాల్లో వారికి కలిసొచ్చిందనే చెప్పవచ్చు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ , పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, కేరళలో కమ్యూనిస్టులు ఇండియా కూటమితో సంబంధం లేకుండా విడిగా పోటీ చేసినా .. మొత్తంగా వారి మద్దతు ఇండియా కూటమికే ఉండడంతో కూటమి బలం గతం కంటే బాగానే పెరిగింది. ఇంకా చెప్పాలంటే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో ఉన్న రెండు ప్రధాన పార్టీలను తమవైపు తిప్పుకుంటే ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది ఇండియా కూటమి.

Recent Posts

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?

Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP  ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…

46 minutes ago

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…

2 hours ago

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

3 hours ago

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

3 hours ago

Rain Water : వర్షపు నీరు ఎప్పుడైనా తాగారా… ఇది ఆరోగ్యానికి మంచిదేనా…?

Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…

5 hours ago

Gk Fact Osk : కోడి కూడా ఈ దేశానికి జాతీయ పక్షి… మీకు తెలుసా…?

Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…

6 hours ago

Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…?

Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…

7 hours ago

Business : కొత్తగా బిజినెస్ చేసేవారు ఈ బిజినెస్ చేస్తే కోటేశ్వర్లు కావొచ్చు

Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…

8 hours ago