RBI bans 2000 Notes : మీకు గుర్తుందా? అది 2016వ సంవత్సరం. ఒక రోజు రాత్రి సడెన్ గా అన్ని టీవీల్లో ప్రధాని మోదీ ప్రత్యక్షమయ్యారు. ఈరోజు రాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఆ నోట్లు ఇక చెల్లవని ఆ నోట్లు ఉన్నవాళ్లు వెంటనే బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలని చెప్పారు. దీంతో ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూ కట్టారు. వాటిని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.100 నోట్లను తీసుకొచ్చారు. ఇదివరకు ఎప్పుడూ చెలామణిలో లేని రూ.2000 నోట్లను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఇప్పుడు ఆ రెండు వేల రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. వెంటనే అన్ని బ్యాంకులు రూ.2 వేల నోట్లను వినియోగదారులకు ఇవ్వకుండా నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అసలు ఇంత సడెన్ గా ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లను ఎందుకు బ్యాన్ చేసింది.. అంటే రెండు వేల నోటు అనేది చాలా పెద్దది. ప్రస్తుతం నల్లధనం అనేది ఎక్కువగా ఈ నోట్ల రూపంలోనే ఉంది. వాటి నకిలీ నోట్లు కూడా చలామణిలో ఉన్నట్టు ఆర్బీఐకి తెలిసింది.ఎవరైనా నల్లధనాన్ని దాయాలనుకుంటే రూ.2 వేల నోట్లనే దాస్తున్నారు. అవి ఎక్కువ కట్టలు అవసరం ఉండదు. తక్కువ నోట్లు.. ఎక్కువ మొత్తంలో దాయొచ్చు.
అలాగే.. రూ.2 వేల నకిలీ నోట్లు కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి. అవి ఎక్కువ సంఖ్యలో వస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థకే తీవ్ర ముప్పు కలిగిస్తుంది. నిజానికి.. 2019 సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ ఆపేసింది. దేశంలో ఇప్పుడు రూ.3.52 లక్షల కోట్ల వాల్యూ ఉన్న రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇది ఎన్నికల కాలం కావడం, త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు విచ్చలవిడిగా రూ.2 వేల నోట్లను ప్రజలకు ఎరగా చూపిస్తూ ఖర్చు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. ఈ నిర్ణయం దేశంలో ఎంత మేరకు మార్పు తీసుకొస్తుందో?
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.