Tomatoes : కూరలో టమాటా వేసిన భర్త.. ఊహించని షాక్ ఇచ్చిన భార్య..!!
Tomatoes : దేశంలో ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్ని అంటయి ఈ అన్న సంగతి తెలిసిందే. దీంతో చాలామంది టమాట కొనడానికి భయపడే పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాలలో కేజీ 150 ధర పలుకుతుంటే మిగతా కొన్ని రాష్ట్రాలలో కేజీ 200 ధర పలుకుతుంది. టమాటా ధర పెరగటంతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి వర్గాల వారు.. టమాటా కొనటానికి భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది భర్తలు టమాట కొనటానికి వెనకడుగు వేస్తున్నారు. కరోనా తర్వాత మామూలుగానే ప్రపంచంలో పరిస్థితులు చాలా మారిపోయాయి.
అనేక ధరలు ఒక్కసారిగా పెరగటంతో పేద మరియు మధ్యతరగతి ప్రజల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఒకపక్క ఉద్యోగాలు లేకపోవడంతో మరోపక్క ధరలు అధికంగా ఉండటంతో… రోజువారి జీవితాన్ని కొనసాగించటం కత్తి మీద సాములగా మారింది. ఇటువంటి పరిస్థితులలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. మేటర్ లోకి వెళ్తే ఆ రాష్ట్రంలో సంజీవ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యకు చెప్పకుండా కూరలో భర్త టమాటా వేయటంతో.. భార్య ఊహించిన షాక్ ఇచ్చింది.
wife gave an unexpected shck her husband For tomatoes
భర్త చేసిన ఆ కూర తినకుండానే అలిగి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. టమాట ధరలు అధికంగా ఉన్న సమయంలో… టమాటాలు వాడటం అవసరమా అని అలిగి కోపంతో వెళ్లిపోవడంతో సంజీవ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో భార్యను బొజ్జగించడానికి నానాదంతాలు పడుతున్నాడట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టమాట సమస్య ఈ రకంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది.
