317 go children request to cm kcr on 317 go
317 GO : తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన 317 జీవోను ఉద్యోగులు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. ఈ జీవో విషయమై ఉద్యోగులు ప్రతీ రోజు ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతూనే ఉన్నారు. కాగా, ఈ సారి ఉద్యోగుల పిల్లలు తాము 317 జీవో వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేసీఆర్ ను ప్రశ్నించారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుతో వినూత్న నిరసన తెలిపారు.సంక్రాంతి సందర్భంగా అందరూ ఇళ్ల ఎదుట ముగ్గులు వేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ముగ్గు ద్వారా కూడా నిరసన తెలపాలనే ఉద్దేశంతో ముగ్గు వేశారు. సదరు ముగ్గులో ఆదిలాబాద్ కు చెందిన చిన్నారులు తమ ప్రశ్నలు కూడా సంధించారు. తమ తల్లికి ఒక జిల్లా, తండ్రికి మరో జిల్లా కేటాయించడంతో తమ పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా వారు వినూత్న రీతిలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని చిన్నారులు ముగ్గులో రాశారు.తాము ఏ జిల్లాకు వెళ్లాలి అని కేసీఆర్ను తాత అని సంబోధిస్తూ అడిగారు. ఈ క్రమంలోనే తమ తల్లిదండ్రులను తమ నుంచి విడదీయొద్దని, తమ వద్దే ఉంచాలని కోరారు.
317 go children request to cm kcr on 317 go
ముగ్గులో వారి హ్యాపీ పొంగల్ అని ఇంగ్లిష్ అక్షరాలతో రాసిన క్రమంలో ఎడమ వైపున ‘అమ్మ ఒక జిల్లా.. నాన్న ఒక జిల్లా.. నేను ఏ జిల్లా… కేసీఆర్ తాతా? ’ అని రాశారు. మరో వైపున జీవో నెం.317 స్పౌజ్ బాధితులు ఆదిలాబాద్ అని పేర్కొన్నారు. ఇక ఈ ముగ్గు ముందర ఇద్దరు అమ్మాయిలు చేతులు జోడించి మరి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. మొత్తంగా ఉద్యోగులే కాదు ఉద్యోగుల పిల్లలు కూడా వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఈ సంగతి ఈ చిన్నారులు చేసిన పని ద్వారా స్పష్టమవుతున్నది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.