Home » Exclusive » A Child Died After Drinking Mosquito Liquid In Hyderabad
Exclusive

Mosquito Liquid : దోమల మందు.. మస్కిటో లిక్విడ్ తాగి చనిపోయిన చిన్నారి..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: April 9, 2023, 6:00 pm
Advertisement

Mosquito Liquid : హైదరాబాద్ చందానగర్ లో జాకీర్ అనే చిన్నారి మస్కిటో లిక్విడ్ తాగి చనిపోయాడు. ఇంటిలో దోమలు ఎక్కువగా ఉండటంతో తల్లిదండ్రులు దోమల మందు కొనడం జరిగింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఎవరికి వారు తమ పనులలో నివాగ్నమై ఉండగా ఏడాదిన్నర వయసున్న జాకీర్ ఆడుకుంటూ.. మస్కిటో లిక్విడ్ తాగేయడం జరిగింది. దీంతో బాబు బాగా ఏడుస్తూ ఉండటంతో వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఎత్తుకోక నోటిలో దోమల మందు వాసన…

Advertisement

వస్తూ ఉండటంతో హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది. అయితే హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ జాకీర్ మరణించడం జరిగింది. వెంటనే పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ప్రమాద వశాత్తు జరిగిందా లేక బాలుడి మరణంలో మరో కోణం ఏమైనా ఉందా అనే విషయంపై పేరంట్స్ ను విచారిస్తున్నారు. ఏడాదిన్నర పిల్లలు కలిగిన ఇలలో చేతికందే విధంగా ఇటువంటి కెమికల్స్ బాటిల్స్

Advertisement

a child died after drinking mosquito liquid in hyderabad

పెట్టకూడదని సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తపై నేటిజన్లు తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. అసలు చిన్నారులు తిరిగే చోట్ల ఇటువంటి ప్రమాదకరమైన వస్తువులు ఇంట్లో పెట్టకూడదని మరి కొంతమంది సలహాలు ఇస్తున్నారు. ఒక్క మస్కిటో కాయిల్స్.. లిక్విడ్ మాత్రమే కాదు సెల్ఫోన్ వంటి చార్జర్లు దగ్గరికి కూడా…పిల్లలు వెళ్లకుండా అటువంటి వస్తువులు ఉన్న చోట నుండి.. వేరేచోట పిల్లాడిని పెట్టాలని కొంతమంది సలహాలు ఇస్తున్నారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి