ప్రస్తుతం మారిన కాలం కారణంగా మనిషిలో అన్ని చెడు ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. డబ్బుకు ఇస్తున్న విలువ మనుషులకు ఇవ్వలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో దారుణాలకు ఓడిగడుతున్నారు. ఎదుటివారిని ఈజీగా బురిడీ కొట్టిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇటీవల చాలామంది పురుషులు, మహిళలు కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. పెళ్లి చేసుకొని అందినంత డబ్బుతో ఉడాయిస్తున్నారు. నిత్య పెళ్లికూతురు, పెళ్లి కొడుకు గుట్టురట్టు అవడంతో పోలీసులకు దొరికిపోతున్నారు.
తాజాగా ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె పెళ్లి చేసుకొని తరువాత డబ్బు, నగలను తీసుకోని పారిపోవడం చేసేది. అలా ఏకంగా 12 కు పైగా పెళ్లిళ్లు చేసుకొని అందరిని దారుణంగా మోసం చేసింది. ఓ వ్యక్తి ఆమె మోసానికి గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె బాగోతం బయటపడింది. ఈ ఘటన జమ్ము కాశ్మీర్లో చోటుచేసుకుంది. షాహిన్ అనే 30ఏళ్ల యువతి నాలుగు నెలల క్రితం మహమ్మద్ అల్తాఫ్ ను వివాహం చేసుకుంది. పెళ్లి సందర్భంగా వచ్చిన డబ్బులు, నగలు తీసుకొని ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది.
తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన మహమ్మద్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. పోలీసుల దర్యాప్తులో షాహిన్ రాజౌరి జిల్లాలోని నౌషేరాలో ఉంటున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే జులై 14న ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఆమె అరెస్ట్ అయిన విషయం తెలుసుకొని షాహిన్ అక్తర్ తమను కూడా పెళ్లి చేసుకొని మోసం చేసిందని 12మంది పురుషులు ఆరోపించారు. మరోవైపు షాహిన్ బెయిల్ కోసం బుద్గామ్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. పెళ్లి తర్వాత డబ్బు, నగలతో షాహిన్ ఉడాయించినట్లు ఆరోపించారు. అయితే షాహిన్ ఎంతమందిని పెళ్లి చేసుకుని మోసం చేసిందో దర్యాప్తు చేయాల్సి ఉంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.