Home » Exclusive » Aftab Comments On Shraddha Walker Murder Case
Exclusive

Shraddha Walker Murder Case : శ్రద్ధాన్ని చంపినందుకు నాకు పెద్ద బాధ ఏమీ లేదు.. ఆఫ్తాబ్ సంచలన వ్యాఖ్యలు..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: November 30, 2022, 4:23 pm
Advertisement

Shraddha Walker Murder Case : దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధావాల్కర్‌ హత్యకేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ఆఫ్తాబ్ … తన ప్రియురాలు శ్రద్ధావాల్కర్‌ నీ 35 ముక్కలు చేసి.. నరరూప రాక్షసుడిగా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే నిందితుడు ఆఫ్తాబ్ కి పూనావాలాకు ఢిల్లీలోని రోహిణిలోగల ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఈ క్రమంలో అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ టెస్ట్ లలో శ్రద్ధానీ తానే చంపినట్లు అంగీకరించడం జరిగిందట. అయితే ఆమెను చంపినందువల్ల తానే మీ బాధపడటం లేదని ఆఫ్తాబ్ … ఈ పరీక్షల్లో.. వెల్లడించినట్లు దర్యాప్తు బృందాలు చెప్పుకొస్తున్నాయి. ఇంకా ఈ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో పాలీగ్రాఫ్‌ టెస్ట్‌లో …

Advertisement

శ్రద్ధానీ చంపిన తర్వాత ఆమె శరీర భాగాలు.. ముక్కలు ముక్కలుగా నరికినట్లు అడవిలో పడేసినట్లు కూడా ఆఫ్తాబ్ ఒప్పుకోవటం జరిగిందట. ఒక్క శ్రద్ధాతో మాత్రమే కాదు ఇంకా తనకి చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని నిందితుడు అంగీకరించినట్లు సదరు వర్గాలు తెలియజేస్తున్నాయి. పాలీగ్రాఫ్‌ టెస్ట్‌లో…ఆఫ్తాబ్ చాలా సాధారణంగా మాట్లాడటం జరిగిందట. ఈ హత్యకు సంబంధించి అన్ని విషయాలు పోలీసులకు తెలియజేసినట్లు ఈ విచారణలో పదే పదే చెప్పటం జరిగింది అంట. ఒక పోలీసులకు మాత్రమే కాదు ఆ మధ్య కోర్టు ముందు కూడా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఆఫ్తాబ్ కి పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ అనంతరం నార్కో పరీక్షలు జరిపించడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో నార్కో పరీక్షల కోసం… పోలీసులకు కోర్టు అనుమతులు కూడా ఇవ్వటం జరిగింది అంట.

Aftab comments on Shraddha Walker Murder Case

Advertisement

డిసెంబర్ 1 మరియు 5వ తారీఖులలో ఢిల్లీలోని రోహిణి ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ లో… ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో పాలీగ్రాఫ్, నార్కో పరీక్షలలో నిందితుడు ఇచ్చే వాంగ్మూలాన్ని ప్రధాన సాక్షాలుగా.. తీసుకోకుండా వాటిని కేవలం ఆధారాలుగా మాత్రమే పరిగణించనున్నారు. మరోపక్క శ్రద్ధ డిఎన్ఏ పరీక్షకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చాక.. ఈ హత్య కేసు అసలు విషయాలు మొత్తం బయటపడనున్నాయి. శ్రద్ధ తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నవంబర్ 12 వ తారీఖున ఆఫ్తాబ్ నీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ప్రియురాలు శ్రద్ధనీ చంపి ఆమె దేహాన్ని 35 ముక్కలుగా నరికి.. పలు ప్రాంతాల్లో ఆఫ్తాబ్ విసేరిసినట్లు విచారంలో చెప్పడం యావత్ దేశాని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి