Amaravati Land Scam case: High Court stays FIR against chandrababu Naidu
Chandrababu : అనుకున్నట్టే జరిగింది. ఇది అందరూ ఊహించిందే. ఖచ్చితంగా రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుకు చుక్కెదురవుతుందని.. అందరూ ఊహించినట్టే సీఐడీ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే.. ఆదిలోనే సీఐడీకి షాక్ తగిలింది. చంద్రబాబు ప్రస్తుతానికి ఈ కేసు నుంచి గట్టెక్కగలిగారు.
Amaravati Land Scam case: High Court stays FIR against chandrababu Naidu
చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ వేసిన కేసులపై, వారిపై విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. అమరావతి భూముల వ్యవహారంపై సీఐడీ కేసులు నమోదు చేయగానే.. ఆ కేసులను కొట్టేయాలంటూ.. చంద్రబాబు, నారాయణ.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు.. వాళ్లపై పెట్టిన కేసులకు సంబంధించిన ఆధారాలను చూపాలంటే సీఐడీని ప్రశ్నించింది.
ఇప్పుడే ప్రాథమిక విచారణ జరుగుతున్నందున ఇప్పుడే ఆ వివరాలు కోర్టుకు చెప్పలేమని.. సీఐడీ తరుపు న్యాయవాది కోర్టుకు చెప్పడంతో.. సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది. దీంతో సీఐడీ విచారణకు చంద్రబాబు, నారాయణ హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే.. అక్కడ భూములకు సంబంధించి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని.. అమరావతిలో ఉన్న దళితుల భూములను అక్రమంగా లాక్కొని.. వాటిని తన బినామీలకు కట్టబెట్టారని చంద్రబాబుపై ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుతో పాటు నారాయణ కూడా ఈ భూముల వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారని.. సీఐడీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన సీఐడీ.. చంద్రబాబు, నారాయణపై పలు కేసులు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో వెంటనే కోర్టులో ఇద్దరూ క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు.
అయితే.. చంద్రబాబు నెక్స్ ట్ స్టెప్ ఏంటి.. అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతానికి సీఐడీ కేసును హైకోర్టు స్టే విధించినా.. రేపు.. సీఐడీ అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తే.. చంద్రబాబును విచారించడానికి కోర్టు ఖచ్చితంగా సీఐడీకి పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ.. కోర్టు పర్మిషన్ ఇస్తే.. అప్పుడు సీఐడీ విచారణలో చంద్రబాబు ఏం చెబుతారు.. అప్పుడు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు.. అసలు అమరావతి అసైన్డ్ భూముల విషయంలో తన ప్రమేయం ఉందా? లేదా? అనే దానిపై ఎటువంటి సమాధానం చెబుతారు? అనే దానిపై ప్రస్తుతం సందిగ్దం నెలకొన్నది.
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
This website uses cookies.