Categories: andhra pradeshNews

పాలు తాగే బిడ్డ కనికరం చూపించండి సర్.. పోలీసులతో ఒక తల్లి ఆవేదన.. అసలేం జరిగిందంటే..

Advertisement
Advertisement

ananthapuram : సృష్టిలోని మానవ సంబంధాల్లో అతిముఖ్యమైన, అతి పవిత్రమైన బంధం ఏమిటంటే అది తల్లి బిడ్డల బంధం. ఎలాంటి స్వార్దాలకు తావులేని స్వచ్ఛమైన ప్రేమ, అలాంటి తల్లి బిడ్డలను విడతీసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ జిల్లాకు చెందిన బుక్కపట్నం మండలం దూపంపల్లికి చెందిన వినయ అనే మహిళ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఆమెకు వెంకటరెడ్డి అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఓ బాబు కూడా పుట్టాడు. బాబు పుట్టినప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. డబ్బు తేవాలంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది.

Advertisement

ananthapuram woman fighting for her two year old child

అక్కడే ఉంటూ వర్క్ చేసుకుంటూ తన రెండేళ్ల బిడ్డను చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో కొద్దీ రోజుల కిత్రం ఆమె భర్త, అతని బంధువులు వినయ వాళ్ళ ఇంటికి వచ్చి, ఆమెతో గొడవపెట్టుకొని రెండేళ్ల బాబును బలవంతంగా తీసుకోని వెళ్లిపోయారు. దీనితో ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ‘నా బాబును నాకు ఇప్పించండి సార్. పాలు తాగే బిడ్డ సార్. తల్లి లేకుంటే ఉండలేడు. నా భర్త నా నుంచి బలవంతంగా లాక్కుని వెళ్లిపోయాడు. ప్లీజ్. దయచేసి నా రెండేళ్ల బాబును నాకు ఇప్పించండి‘ అంటూ ఆ తల్లి కాళ్లావేళ్లా పడ్డా పోలీసులు కనికరించలేదు. కనీసం కేసు కూడా తీసుకోలేదు. ఈ ఘటనపై డీఎస్పీ రమాకాంత్ కు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లేదు.

Advertisement

ఇక తాజాగా ఎస్పీ సత్యయేసు బాబు ఆద్వర్యంలో స్థానిక డీపీఓ ఆవరణలో పోలీస్ స్పందన కార్యక్రమం జరుగుతోందని ఆమెకు తెలిసింది. దీనితో ఆమె ఆ కార్యక్రమానికి వెళ్లి, తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని తన బిడ్డను తిరిగి తనకు అప్పగించాలని వేడుకుంది. దీనితో స్పందించిన సత్యయేసు బాబు ‘నిబంధనల ప్రకారం ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలు తల్లి వద్దే ఉండాలి. అది ఎలాంటి వివాదానికి సంబంధించిన కేసయినా సరే చిన్న పిల్లలు మాత్రం తల్లివద్దే ఉండాలి. చివరకు ఏదైనా కేసులో తల్లి జైలుకు వెళ్లినా పిల్లలు కూడా తల్లి వెంటే ఉన్న ఉదంతాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా ఆమెకు బిడ్డను ఎందుకు తెచ్చి ఇవ్వలేదు. విచారణ సంగతి తర్వాత ముందు బిడ్డను తెచ్చి ఆమెకు ఇవ్వండి‘ అంటూ అప్పటికప్పుడే సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీచేశాడు.

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

5 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

This website uses cookies.