ఏపీలో ఒక్క కాలేజీలో ఒకే రోజులో 163 మందికి కరోనా

Advertisement
Advertisement

AP corona : ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర అలజడిని సృష్టిస్తుంది. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాజమండ్రి సమీపంలోని ఓ కళాశాలలో 163 మందికి కరోనా సోకింది. దీంతో అధికారులు అలర్టయ్యారు. మరోవైపు సీఎం జగన్ కూడా పెరుగుతున్న కేసులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై సమీక్షిస్తున్నారు. అయితే అన్ని కళాశాలలు పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 700 మంది విద్యార్థుల నమూనాలు సేకరించారు.

Advertisement

ఆ కాలేజీలో రెండు రోజులుగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మొదటి రోజు కొందరు విద్యార్థులను టెస్ట్ చేస్తే 13 కేసులు బయటపడ్డాయి. రెండో రోజు 10 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య తగ్గిందిలే అని ఆ కాలేజీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కానీ ఒక్క రోజే 140 మందికి కరోనా సోకినట్లు నిర్దారణ కావటంతో ఏపీ ఉలిక్కిపడింది. కరోనా సోకినా వాళ్ళను ఒక క్యాంపస్ లో ఉంచి దానిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. అదే కాలేజీలోని మరో 450 మంది మందిని వేరే హాస్టల్ కు తరలించినట్టు వివరించారు.

Advertisement

corona for 163 students in a single day in AP

అంతేకాక రాజమండ్రిలోని ఓ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో రాష్ట్రంలో 310 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 894044కి చేరింది. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా సోకి గత 24 గంటల్లో ఇద్దరు మరణించారు. చిత్తూరు జిల్లాలో ఒకరు కృష్ణాలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 7191 మంది మృతిచెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 114 మంది పూర్తిగా కోలుకోగా ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 884471కి చేరింది.

రాష్ట్రం లో ప్రస్తుతం 2382 యాక్టివ్ కేసులున్నాయి. అయితే కొత్త కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అనంతపురంలో 26 చిత్తూరులో 51 తూర్పు గోదావరి లో 43 గుంటూరు లో 28 కడప లో 20 కృష్ణా లో 26 కర్నూలు లో 21 నెల్లూరు లో 13 ప్రకాశం లో 12 శ్రీకాకుళం లో 20 విశాఖపట్నం లో 43 విజయనగరంలో 7 కొత్త కేసులు నమోదయ్యాయని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పక్రియ జరుగుతున్నా కానీ కొత్త కేసులు నమోదు కావటం ఆందోళన కలిగించే విషయం.

Advertisement
Advertisement

Recent Posts

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

16 minutes ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

45 minutes ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

1 hour ago

Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…

2 hours ago

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

3 hours ago

BB Jodi Season 2 : రీతూ ఫొటోకి దండ.. థూ అంటున్నారు

BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…

3 hours ago

YSRCP : బిగ్ బ్రేకింగ్… వైసీపీ కి అతిపెద్ద నేత రాజీనామా..?

YSRCP  : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…

4 hours ago

Ram Charan Upasana Twins : పుట్టి నెల కాలేదు .. రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల పై చిరంజీవి షాకింగ్ నిర్ణయం

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…

5 hours ago