Banks Merge | ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల విలీనం .. ఖాతాదారులకు ముందస్తు హెచ్చరిక
Banks Merge | కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ నెమ్మదిగా అమలు అవుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని నాలుగు ప్రధాన గ్రామీణ బ్యాంకులు –
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్
సప్తగిరి గ్రామీణ బ్యాంక్ – ఇన్నీ విలీనం అయి ఒక్కటే బ్యాంకుగా ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు’గా ఏర్పడనున్నాయి.
సాంకేతిక విలీన ప్రక్రియ: 5 రోజుల సేవలకు విఘాతం
#image_title
ఈ విలీనానికి సంబంధించి బ్యాంక్ తాజాగా ఒక సర్క్యులర్ను విడుదల చేసింది. అందులో భాగంగా అక్టోబర్ 9 (బుధవారం) సాయంత్రం 6 గంటల నుండి అక్టోబర్ 13 (ఆదివారం) ఉదయం 10 గంటల వరకు పలు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొంది.
ఈ సేవలు లభించవు:
మొబైల్ బ్యాంకింగ్
ఇంటర్నెట్ బ్యాంకింగ్
యూపీఐ / ఐఎంపీఎస్
ఏటీఎం లావాదేవీలు
బ్యాంక్ మిత్ర సేవలు
బ్రాంచ్ ఆధారిత బ్యాంకింగ్ (వారాంతపు సెలవులతో కలిపి)
అక్టోబర్ 11 (శనివారం), అక్టోబర్ 12 (ఆదివారం) బ్యాంక్ సెలవులుగా ఉన్నప్పటికీ, ఆన్లైన్ సేవలు కూడా అందుబాటులో ఉండవు.
దీనివల్ల మొత్తం 5 రోజులపాటు ఈ గ్రామీణ బ్యాంకుల ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.