Categories: BusinessNews

Union Budget 2026 : రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా మరో పథకం..!

Advertisement
Published by
Advertisement

Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సామాన్యుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు రైతుల నుంచి యువత వరకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా త్వరలో పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ ప్రకటనలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement

Union Budget 2026 : రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా మరో పథకం..!

Union Budget 2026 : ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ వ్యూహం

ఎన్నికల సంవత్సరంలో వచ్చే బడ్జెట్ కావడంతో ప్రభుత్వం ప్రజాకర్షక నిర్ణయాలపై దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త సంక్షేమ పథకాలు ఇప్పటికే అమలులో ఉన్న పథకాల విస్తరణ ఆదాయపు పన్ను మినహాయింపులు, జీఎస్టీ రాయితీలపై కీలక ప్రకటనలు ఉండొచ్చని అంచనా. మధ్యతరగతి భారం తగ్గించే చర్యలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రైతులకు మేలు చేసే విధంగా సబ్సిడీలు, తక్కువ వడ్డీ రుణాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచే దిశగా బడ్జెట్ ఉండొచ్చని సమాచారం.

Advertisement

Union Budget 2026 : పీఎం కుసుమ్ 2.0: సౌరశక్తితో రైతుల భవిష్యత్

ఈ బడ్జెట్‌లో ప్రధాన ఆకర్షణగా పీఎం కుసుమ్ పథకం రెండో దశ (PM KUSUM 2.0)పై ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న పథకం గడువు మార్చి 2026తో ముగియనున్న నేపథ్యంలో మరింత విస్తృత లక్ష్యాలతో కొత్త దశను ప్రారంభించనున్నారు. రైతులకు తక్కువ ధరలకే స్వచ్ఛమైన సౌర విద్యుత్ అందించడం డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో సౌర ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయం పెంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది తోడ్పడనుంది.

Union Budget 2026 : భారీ కేటాయింపులు, ఆధునిక సాంకేతికత

పీఎం కుసుమ్ 2.0 పథకానికి ఈ బడ్జెట్‌లో సుమారు రూ.50 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండవచ్చని అంచనా. తొలి దశలో ప్రభుత్వం ఇప్పటికే రూ.32,400 కోట్లు వెచ్చించింది. కొత్త దశలో రైతులకు సౌర ప్యానెల్‌ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఆధునిక టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా బ్యాటరీ నిల్వ సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా పగలు, రాత్రి అనే తేడా లేకుండా రైతులకు విద్యుత్ అందించనున్నారు. ఇది విద్యుత్ సరఫరాను మరింత నమ్మదగినదిగా మార్చనుంది. 2019లో ప్రారంభమైన పీఎం కుసుమ్ యోజన ఇప్పటికే రైతులకు సౌర పంపులు, విద్యుత్ సౌకర్యం అందిస్తూ మంచి ఫలితాలు ఇస్తోంది. 2024లో దీన్ని మరింత విస్తరించారు. ఇప్పుడు 2.0 రూపంలో ఈ పథకం రైతులకు విద్యుత్‌తో పాటు నీటి భద్రతను కూడా కల్పించే దిశగా ముందుకు సాగనుంది. ఇక ఈ కేంద్ర బడ్జెట్ రైతుల జీవన ప్రమాణాలు పెంచేలా దేశాన్ని హరితశక్తి వైపు నడిపించేలా ఉండనుందని ఆశలు వ్యక్తమవుతున్నాయి.

 

Advertisement
Suma Ch

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Recent Posts

kondigari Ramulu : నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం .. రెండుసార్లు ఎమ్మెల్యే అయినా సాధారణ జీవితం

kondigari Ramulu  : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…

39 minutes ago

Nakirekal : నకిరేకల్‌లో దివ్యాంగులకు ప్రత్యేక స్కూటీల పంపిణీ

Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…

2 hours ago

Vijay Jason vs Vijay : హుటాహుటిన కంట్లో నీళ్ళతో కొడుకు ఇంటికి బయలుదేరిన తమిళ హీరో విజయ్

Vijay Jason vs Vijay  : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…

2 hours ago

Hyderabad: హైదరాబాద్ లో అడుగు పెట్టాలి అంటే భయపడుతున్నారు

Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…

3 hours ago

YS Jagan Good News : కష్టాల మధ్యలో జగన్ కి బ్రహ్మాండమైన గుడ్ న్యూస్

YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…

5 hours ago

Iran New Supreme: ఇరాన్ పీఠం ఎక్కడమే ట్రంప్ కి వణుకు పుట్టించిన కొత్త సుప్రీం లీడర్

Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…

5 hours ago

Velidanda : వెలిదండలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన ..

Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…

6 hours ago

Alekhya Reddy : బ్రేకింగ్… తిరగబడిన తారకరత్న భార్య !

Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…

7 hours ago

Sanju Samson : వామ్మో సంజూపై ఇంత కుళ్లా? .. శుభ్‌మన్ గిల్ పోస్ట్‌పై అభిమానుల ఆగ్రహం ..!

Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…

8 hours ago

Pawan Kalyan : ఓకే స్క్రీన్ పై పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ .. కొత్త సినిమాలో స్పెషల్ క్యామియోపై ఆసక్తికర చర్చలు ..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…

9 hours ago

students : విద్యార్థులకు బ్యాడ్ న్యూస్ .. రేపు సెలవు లేదు .. ఒంటి పూట బడులపై కీలక నిర్ణయం..!

students : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…

11 hours ago

Kerosene : యుద్ధం ఎఫెక్ట్ .. ‘బ్యాకప్’ కిరోసిన్ .. మోదీ ప్రభుత్వం కొత్త ప్లాన్!

Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…

12 hours ago