
Union Budget 2026 : రైతులకు గుడ్న్యూస్.. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా మరో పథకం..!
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సామాన్యుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు రైతుల నుంచి యువత వరకు ఈ బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా త్వరలో పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ ప్రకటనలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Union Budget 2026 : రైతులకు గుడ్న్యూస్.. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా మరో పథకం..!
ఎన్నికల సంవత్సరంలో వచ్చే బడ్జెట్ కావడంతో ప్రభుత్వం ప్రజాకర్షక నిర్ణయాలపై దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త సంక్షేమ పథకాలు ఇప్పటికే అమలులో ఉన్న పథకాల విస్తరణ ఆదాయపు పన్ను మినహాయింపులు, జీఎస్టీ రాయితీలపై కీలక ప్రకటనలు ఉండొచ్చని అంచనా. మధ్యతరగతి భారం తగ్గించే చర్యలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రైతులకు మేలు చేసే విధంగా సబ్సిడీలు, తక్కువ వడ్డీ రుణాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచే దిశగా బడ్జెట్ ఉండొచ్చని సమాచారం.
ఈ బడ్జెట్లో ప్రధాన ఆకర్షణగా పీఎం కుసుమ్ పథకం రెండో దశ (PM KUSUM 2.0)పై ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న పథకం గడువు మార్చి 2026తో ముగియనున్న నేపథ్యంలో మరింత విస్తృత లక్ష్యాలతో కొత్త దశను ప్రారంభించనున్నారు. రైతులకు తక్కువ ధరలకే స్వచ్ఛమైన సౌర విద్యుత్ అందించడం డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో సౌర ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయం పెంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది తోడ్పడనుంది.
పీఎం కుసుమ్ 2.0 పథకానికి ఈ బడ్జెట్లో సుమారు రూ.50 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండవచ్చని అంచనా. తొలి దశలో ప్రభుత్వం ఇప్పటికే రూ.32,400 కోట్లు వెచ్చించింది. కొత్త దశలో రైతులకు సౌర ప్యానెల్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఆధునిక టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా బ్యాటరీ నిల్వ సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా పగలు, రాత్రి అనే తేడా లేకుండా రైతులకు విద్యుత్ అందించనున్నారు. ఇది విద్యుత్ సరఫరాను మరింత నమ్మదగినదిగా మార్చనుంది. 2019లో ప్రారంభమైన పీఎం కుసుమ్ యోజన ఇప్పటికే రైతులకు సౌర పంపులు, విద్యుత్ సౌకర్యం అందిస్తూ మంచి ఫలితాలు ఇస్తోంది. 2024లో దీన్ని మరింత విస్తరించారు. ఇప్పుడు 2.0 రూపంలో ఈ పథకం రైతులకు విద్యుత్తో పాటు నీటి భద్రతను కూడా కల్పించే దిశగా ముందుకు సాగనుంది. ఇక ఈ కేంద్ర బడ్జెట్ రైతుల జీవన ప్రమాణాలు పెంచేలా దేశాన్ని హరితశక్తి వైపు నడిపించేలా ఉండనుందని ఆశలు వ్యక్తమవుతున్నాయి.
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
This website uses cookies.