విశాఖ : బీజేపీకి అత్యంత కీలకమైన ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లాలో కీలక నేత.. కంభం పాటి హరిబాబు ఇటీవల మిజోరం రాష్ట్ర గవర్నర్గా ప్రమోషన్పై వెళ్లిపోయారు. దీంతో ఇప్పటికి ఉన్న నేతల్లో ఎమ్మెల్సీ మాధవ్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నా.. ఈయనకు పోటీగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా దూకుడు చూపిస్తారని అంటున్నారు. గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసి ఎంపీగా కూడా గెలిచిన ఆమె గత ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే.. ఇప్పటి వరకు హరిబాబు ప్రభావం ఉందని.. అందుకే కొందరు నేతలు పుంజుకోలేక పోతున్నారనే వాదన వినిపించేది. కానీ, ఇప్పుడు హరిబాబు బీజేపీకి దూరమయ్యారు.
దీంతో ఇప్పుడు కీలకమైన విశాఖ రాజకీయాల్లో పట్టు సాధించేది ఎవరు? అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. ఇటీవల ఎమ్మెల్సీ మాధవ్ ఉత్తరాంధ్ర జిల్లాలో గాంధీ సంకల్ప యాత్ర పేరిట సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనిపై పెద్దగా ఫోకస్ రాకపోయినా.. ఆయన మాత్రం విశాఖపై పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని ఆయన చెబుతున్నారు.
కానీ, విశాఖపై పట్టు సాధించాలంటే.. కీలకమైన రెండు పార్టీలు.. వైసీపీ, టీడీపీలను బలంగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉంటుందని.. పైగా పారిశ్రామికంగా , సామాజిక వర్గం పరంగా కూడా పట్టు సాధించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. మాధవ్ ఈ తరహా రాజకీయం చేసే పరిస్థితి లేదని.. కుండబద్దలు కొడుతున్నారు. ఏదైనా ఉంటే.. పురందేశ్వరి వంటి బలమైన సామాజిక వర్గం అండదండలు ఉన్న నాయకురాలు వస్తే.. బాగానేఉంటుందని అంటున్నారు. అయితే.. ఆమె రాకను ఇక్కడి బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎక్కడో ప్రకాశం జిల్లాకు చెందిన ఆమె గతంలో కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎంపీ అవ్వడంతో పాటు కేంద్ర మంత్రి అయ్యి పెత్తనం చేశారు. ఇప్పుడు బీజేపీలో కూడా ఆమెకు ఇక్కడ ప్రధాన బాధ్యతలు ఇస్తే ఇక్కడే పాతుకుపోయి తమపై పెత్తనం చేస్తారని.. స్థానికేతరురాలని.. అంతర్గత ప్రచారం చేస్తున్నారు. దీంతో విశాఖపై పట్టు సాధించడం బీజేపీ నేతలు కత్తిమీద సాముగా మారిందని అంటున్నారు. ఏదేమైనా విశాఖ బీజేపీకి ఇప్పుడు అర్జెంటుగా ఓ లీడర్ అయితే కావాల్సి ఉంది. మరి ఈ లోటును ఎవరు భర్తీ చేస్తారో ? చూడాలి
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.