రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం.. సీఎం జగన్

 Authored By jagadesh | The Telugu News | Updated on :11 December 2020,6:01 pm

జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ సీఎం కాకముందు నుంచి కూడా ఒకేమాట చెబుతూ వస్తున్నారు. తాను అధికారంలో ఉన్నా లేకున్నా.. ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తానని.. తాను రైతు పక్షపాతినని స్పష్టంగా చెబుతారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా సీఎం జగన్.. అదే చెబుతున్నారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

ap cm ys jagan about farmers

ap cm ys jagan about farmers

అందుకే… రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కోసం రైతులకు 99 శాతం పంట రుణాలు ఇచ్చినట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ మీటింగ్ లో పాల్గొన్న సీఎం… రైతులను ఎలా ఆదుకోవాలి.. వాళ్ల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేయాలి.. అనే దానిపై మంత్రులతో చర్చించారు.

రైతు భరోసా కింద ప్రతి రైతుకు 13,500 చెల్లిస్తున్నామని… పెట్టబడి వ్యయం తగ్గించి.. రైతుకు పెద్దపీట వేస్తున్నట్టు జగన్ స్పష్టం చేశారు.

10,461 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కూడా సిద్ధంగా ఉండాలి. వాళ్లకు కూడా రుణాలు ఇవ్వాలి. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారస్తులకు 10 వేలు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి