ys jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న రెండు నిర్ణయాలను సొంత పార్టీ నాయకులు మరియు స్వయంగా మంత్రి వర్గంలోని మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వారు సున్నితంగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇంతకు ఆ రెండు విషయాలు ఏంటంటే.. మొదటిది విశాఖ స్టీల్ ప్లాంట్ లో తయారు అవుతున్న ఆక్సీజన్ ను యూపీ మరియు మహారాష్ట్రకు తరలించేందుకు కేంద్రంకు ఓకే చెప్పడం ఇక రెండవది అమూల్ కోసం రాష్ట్రంలోని 50 శాతం మిల్క్ ఉత్పత్తుల సంఘాలను రద్దు చేయడం. ఈ రెండు నిర్ణయాలు కూడా మంత్రి వర్గంలో ఏకాభిప్రాయంను తీసుకు రాలేదు. జగన్ తీసుకునే ఈ నిర్ణయం వల్ల విపక్షాలు రెచ్చి పోయే అవకాశం ఉందని మంత్రులు అంటున్నారు.
ఏపీలో భారీ ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆక్సీజన్ అవసరం చాలా ఉంది. ఇప్పటికే ఏపీకి కావాల్సిన ఆక్సీజన్ ను తమిళనాడు నుండి తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అలాంటిది ఏపీలో ఉత్పత్తి అయ్యే ఆక్సీజన్ ను కూడా ఇతర రాష్ట్రాలకు తరలించడం వల్ల ఖచ్చితంగా వ్యతిరేకత అనేది వస్తుందని ఈ సందర్బంగా మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆక్సీజన్ కొరత వచ్చిన సమయంలో విపక్ష పార్టీల వారు విమర్శలకు దిగుతారని అందుకే ఆక్సీజన్ ను కేంద్రం చెప్పినట్లుగా ఇతర రాష్ట్రాలకు ఇవ్వద్దని మంత్రులు అంటున్నారు.
ఏపీలో అమూల్ విస్తరణ కోసం 50 శాతం వరకు డైరీలను మూసి వేయాలనే ప్రతిపాధనను ప్రభుత్వం తీసుకు వస్తే ఖచ్చితంగా తెలుగు దేశం పార్టీతో పాటు అన్ని పార్టీల వారు మరియు అన్ని డైరీ సంఘాలు కూడా ఆందోళనలు చేస్తాయి. తద్వారా ప్రభుత్వంపై మచ్చ పడే అవకాశం ఉందని అంటున్నారు. ఆ ఆరోపణలు రాకుండా ఉండాలంటే 50 శాతం డైరీలను మూసి వేసే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ మంత్రులు సున్నితంగా ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎవరి మాట వినే రకం కాదు. అలాంటిది మంత్రులు అడ్డు చెప్తే ఆ నిర్ణయాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనక్కు తీసుకుంటాడా అంటే అనుమానమే అంటున్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.