YS Jagan : కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మెరుగ్గా వుంటేనే, రాష్ట్ర అభివృద్ధి.. తద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్న కోణంలో సంయమనం పాటిస్తూ వస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తూ వస్తున్నా, ఏపీ బీజేపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తూ వస్తున్నా.. వైసీపీ సంయమనం పాటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, సంయమనాన్ని చేతకానితనంగా రాజకీయ ప్రత్యర్థులు భావిస్తున్న దరిమిలా, ఇకపై బీజేపీతోనూ అలాగే కేంద్రంతోనూ అమీ తుమీకి సిద్ధమవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారట. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఇటీవల పర్యటించిన వైఎస్ జగన్, అక్కడి ప్రజలు పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్రాన్ని కాకుండా రాష్ట్రాన్ని నిలదీస్తున్న వైనంపై ఆశ్చర్యపోయారు.
పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి బాధ్యత కేంద్రానిదేనని ప్రజలకు చెప్పేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు కూడా. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనే సంకల్పంతో వున్నా, కేంద్రం సహకరించడంలేదన్న విషయాన్నీ వైఎస్ జగన్ విడమరచి చెప్పారు. అయినాగానీ, వైసీపీ – బీజేపీ మధ్య ఏదో సఖ్యత వుందనీ, ఆ కారణంగానే కేంద్రాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిలదీయడంలేదన్న విమర్శ ఒకటుంది. ఈ నేపథ్యంలో, కేంద్రంతో అమీ తుమీ తేల్చుకోవాలనీ, తద్వారా రాష్ట్ర ప్రజల ముందు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలో ఢిల్లీకి వెళ్ళనున్న ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీతో బేటీ అయి పోలవరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాలపై తాడో పేడో తేల్చుకోనున్నారట. ప్రత్యేక హోదా అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుందనీ, స్టీలు ప్లాంటు విషయంలోనూ కేంద్రాన్ని వైఎస్ జగన్ నిలదీయనున్నారనీ వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, కేంద్రాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో గట్టిగా నిలదీయగలిగితే, అది ఖచ్చితంగా పెను సంచలనమే అవుతుంది.
Jobs In HYDRA : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి విస్తృత…
Lemon Coffee : ప్రస్తుతం ఎంతోమంది లెమన్ వాటర్ ను కేవలం బరువు తగ్గటానికి అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ…
Prakash Raj : తిరుమల లడ్డూ వివాదంపై దేశం మొత్తం సంచలనం కాగా దాని పై రాజాకీయ నేతలను ట్యాగ్…
Ysrcp : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీలో ఉన్న నేతలు మెల్లమెల్లగా…
Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం కొద్ది రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నేరాన్ని జానీ…
Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత…
Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత పలు సినిమాలు చేయగా,అందులో విజయం సాధించినవి చాలా తక్కువే అని…
Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…
This website uses cookies.