ap government YSR Pension KANUKA
YSR Pension KANUKA : భారతదేశంలో ప్రతీ రాష్ట్రంలో కూడా వయో వృద్ధులకు వికలాంగులకు ప్రభుత్వం పింఛన్ ను ఇస్తున్న విషయం తెలిసిందే. ఒకొక్క రాష్ట్రంలో ఒకొక్క విధంగా ఈ పింఛన్ అనేది లబ్ధిదారులకు ఇస్తున్నారు. అయితే ఎక్కువ రాష్ట్రాల్లో పింఛన్ అనేది 5 నుండి 10 వ తారీకు మధ్యలో ఇస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మొదటి తారీకు లోనే అది కూడా ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో మే ఒకటో తారీకు కాకుండానే అంటే అంతకు ముందు రోజే ఏప్రిల్ 30 తారీఖు లోనే పింఛన్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఏప్రిల్ 29, 30 వ తారీకు లో ప్రభుత్వ ఖజానా నుండి వాలంటీర్ల వద్ద కి డబ్బు వెళ్ళింది.
వారు ఒకటో తారీకు ఉదయం నుండి ఇంటింటికి తిరిగి పింఛన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల 30 వ తారీకు రోజున వాలంటీర్లు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఇలా నెల ప్రారంభం కాకముందే పెన్షన్ ఇవ్వడం అనేది ఎక్కడా జరగదని కేవలం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన లో మాత్రమే ఇలా జరుగుతుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒకటో తారీకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పింఛన్ ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు ఇవ్వడాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడా ఎక్కడా అమలు భారీ మొత్తం పింఛన్ ని కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్న విషయం తెలిసిందే.
ap government YSR Pension KANUKA
ఇప్పుడు ఈ నెల ప్రారంభం కాకముందే పింఛన్ ఇచ్చి మరో సారి వార్తల్లో నిలిచారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వయోవృద్దులు మరియు దివ్యాంగుల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియ చేయకుండా ఉండలేకపోతున్నా మంటున్నారు. ఒకప్పుడు పింఛన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి ఉండేది.. కానీ ఇప్పుడు ఒకటో తారీకు రాకముందే పింఛన్ చేతికి వస్తున్న నేపథ్యంలో జగన్ను దేవుడంటూ స్థానికులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కానీ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నేపథ్యంలో ఆయన మళ్లీ సీఎం కావాలని స్వయంగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లుగా ఒక సర్వేలో వెల్లడైంది.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.