TDP
TDP : రాష్ట్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ పేర్కొన్నారు. గత రెండు మూడు రోజులుగా తెలుగు దేశం పార్టీ నాయకులు పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజ్ విషయం లో రాజకీయం చేసే ప్రయత్నాలు చేసి విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును కూడా రాజకీయం చేసి లబ్ది పొందాలని తెలుగు దేశం పార్టీ నాయకులు చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని
ప్రశాంత వాతావరణంలో పకడ్బందీ ఏర్పాట్లు పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలియ జేశారు.పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పరీక్ష పేపర్ లీకేజీ విషయం బయటకు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకున్నామని.. ఆ తర్వాత ఎక్కడ కూడా మళ్లీ లీకేజీ వ్యవహారం జరగలేదని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల విషయంలో తెలుగు దేశం పార్టీకి మాట్లాడే అర్హత లేదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి దానిని కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నించే తెలుగుదేశం పార్టీకి పదోతరగతి పరీక్షలు కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ
TDP deserves to talk about student education
మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణలో లోపాలు లేవని అలాగే ప్రతి చోట కూడా కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో అత్యంత లోపభూయిష్టంగా పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం అప్పట్లో మీడియాలో కూడా వచ్చిందని.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మా ప్రభుత్వం లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పిల్లలకు అసౌకర్యం కలగకుండా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నాం అంటూ బొత్స సత్యనారాయణ తెలియజేశారు. తెలుగు దేశం పార్టీకి విద్యార్థుల చదువు గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.