AP Governor : పదోన్నతులపై తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పదోన్నతులపై కొత్త విధానాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ రాజ్ భవన్ కూడా స్పందించింది. పదోన్నతులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో రాజ్ భవన్ స్పందించి.. ప్రభుత్వం పదోన్నతులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇనిషియల్ క్యాడర్ విధానంలో సీనియారిటీని అమలు చేయాలని ఉద్యోగుల పదోన్నతులపై గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అసంతృప్తిని మిగిల్చింది.
ఎందుకు గత కొన్నేళ్లుగా అమలు అవుతున్న నిబంధనలను పక్కన పెట్టి ఉన్నపళంగా ఇనిషియల్ క్యాడర్ విధానాన్ని తీసుకొచ్చారని ఉద్యోగులు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఉన్న కేటగిరీలనే పరిగణనలోకి తీసుకోవాలని.. కొత్త విధానాన్ని ఆపేయాలని.. దీనిపై గవర్నర్ ఆదేశాలు జారీ చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. సాధారణంగా ఎక్కడైనా పదోన్నతుల విషయంలో పనిచేసే పొజిషన్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. కానీ.. ఉద్యోగి నియామక తేదీ నుంచి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలనే నిర్ణయం అనేదే ప్రస్తుతం వివాదాస్పదం అయింది.
దీనిని కొందరు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కావాలని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కులను హరించేలా ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో పదోన్నతుల వ్యవహారంపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని గవర్నర్ కోరారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సమయంలో ఒక విధంగా మాట్లాడి.. ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎందుకు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం దేనికి సంకేతం అంటూ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.