Nara Lokesh : రంగం సిద్ధమైంది. టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రకు టైమ్ కూడా దగ్గర పడుతోంది. ఈ నెల 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. కుప్పంలో బహిరంగ సభ కూడా ఉంటుంది. అయితే.. బహిరంగ సభకు పోలీసులు కొన్ని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కొన్ని షరతులతో కూడిన పర్మిషన్ ను పోలీసులు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో యాత్ర ఉన్నన్ని రోజులు ఈ నియమ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
పాదయాత్ర కోసం 15 షరతులను, కుప్పంలో జరిగే బహిరంగ సభకు 14 షరతులను విధించారు. ఒకవేళ వీటిని ఉల్లంఘిస్తే మాత్రం పాదయాత్రను రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తే కావాలనే నారా లోకేశ్ ను పాదయాత్ర విషయంలో టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై టీడీపీ.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై జగన్ ప్రభుత్వం తాజాగా స్పందించింది. గతంలో చాలామంది పాదయాత్రలు చేసినప్పుడు ఉన్న పలు మార్గదర్శకాలను ప్రభుత్వం గుర్తు చేసింది. అప్పుడు ఏ మార్గదర్శకాలు అమలు చేశామో… లోకేశ్ విషయంలోనూ అవే మార్గదర్శకాలను అమలు చేశామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
2017 లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోసం కోరగా.. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో అప్పుడు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం అనుమతులు జారీ చేసింది. అప్పుడు కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఆధారంగానే అనుమతులు ఇచ్చామని అప్పటి ప్రభుత్వం చెప్పడంతో.. అవే మార్గదర్శకాలను ఇప్పుడు కూడా అమలు చేశామని చెబుతోంది. ఏది ఏమైనా.. లోకేశ్ పాదయాత్రకు కావాలని జగన్ ప్రభుత్వం నిబంధనల విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
This website uses cookies.