
ap govt request to supreme court over capital case
YS Jagan Govt : ఏపీలో ఎన్నికలు ఇంకా సంవత్సరమే సమయం ఉంది. వచ్చే సంవత్సరం ఈ టైమ్ కి ఏపీలో ఎన్నికల హడావుడే ఉంటుంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాయి. అయితే.. అంతా బాగానే ఉంది కానీ.. అధికార పార్టీని ఒకే ఒక సమస్య వేధిస్తోంది. అదే మూడు రాజధానుల అంశం. ఏపీని సీఎం జగన్ నెంబర్ వన్ చేశారు. చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. మూడు రాజధానుల అంశం మాత్రం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.
ap govt request to supreme court over capital case
అది తేలకపోతే ఎన్నికల్లో ప్రజలకు ఎలా ముఖం చూపించాలి అనే మీమాంశలో అధికార వైసీపీ పార్టీ ఉంది. రాజధాని అంశాన్ని త్వరగా తేల్చాలని అనుకుంటోంది. దానికి కారణం.. త్వరలో వైజాగ్ నుంచి పాలన ప్రారంభించాలనేది కోరిక. చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దాన్ని కాదని.. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేసింది. ఏపీ హైకోర్ట్ కూడా అమరావతికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టింది ఏపీ ప్రభుత్వం.
కానీ.. ఆ కేసు సుప్రీంలో ఇంకా విచారణ దశలోనే ఉంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికలు వచ్చేలోపు అమరావతి కేసును ఎలాగైనా ఓ కొలిక్కి తీసుకురావాలని.. అలా అయితే ప్రజలు తమను నమ్మి ఓటేస్తారని వైసీపీ భావిస్తోంది. అందుకే.. మరోసారి సుప్రీంలో విచారణ వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో ఈనెల 28 న విచారణ ఉంటుందని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. సుప్రీంలో విచారణ పూర్తయితే తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే త్వరగా విచారణ పూర్తి అయ్యేలా చేయాలని భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…
Chicken skin : నాన్వెజ్ ప్రియుల్లో చాలామంది చికెన్ను చర్మంతో కలిపి తినడానికి ఆసక్తి చూపుతారు. ప్రత్యేకంగా ఫ్రైడ్ లేదా…
Coconut Water : వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు ఉత్తమమైన సహజ పానీయం. ఇవి దాహాన్ని…
Summer Diet : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం అవసరం అవుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల…
Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే…
This website uses cookies.