YS Jagan Govt : ఏపీలో ఎన్నికలు ఇంకా సంవత్సరమే సమయం ఉంది. వచ్చే సంవత్సరం ఈ టైమ్ కి ఏపీలో ఎన్నికల హడావుడే ఉంటుంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాయి. అయితే.. అంతా బాగానే ఉంది కానీ.. అధికార పార్టీని ఒకే ఒక సమస్య వేధిస్తోంది. అదే మూడు రాజధానుల అంశం. ఏపీని సీఎం జగన్ నెంబర్ వన్ చేశారు. చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. మూడు రాజధానుల అంశం మాత్రం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.
అది తేలకపోతే ఎన్నికల్లో ప్రజలకు ఎలా ముఖం చూపించాలి అనే మీమాంశలో అధికార వైసీపీ పార్టీ ఉంది. రాజధాని అంశాన్ని త్వరగా తేల్చాలని అనుకుంటోంది. దానికి కారణం.. త్వరలో వైజాగ్ నుంచి పాలన ప్రారంభించాలనేది కోరిక. చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దాన్ని కాదని.. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేసింది. ఏపీ హైకోర్ట్ కూడా అమరావతికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టింది ఏపీ ప్రభుత్వం.
కానీ.. ఆ కేసు సుప్రీంలో ఇంకా విచారణ దశలోనే ఉంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికలు వచ్చేలోపు అమరావతి కేసును ఎలాగైనా ఓ కొలిక్కి తీసుకురావాలని.. అలా అయితే ప్రజలు తమను నమ్మి ఓటేస్తారని వైసీపీ భావిస్తోంది. అందుకే.. మరోసారి సుప్రీంలో విచారణ వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో ఈనెల 28 న విచారణ ఉంటుందని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. సుప్రీంలో విచారణ పూర్తయితే తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే త్వరగా విచారణ పూర్తి అయ్యేలా చేయాలని భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.