
ap minister Botsa Satyanarayana good news to govt teachers
Botsa Satyanarayana : విద్య సంవత్సరం ఏపీలో పూర్తయింది. ఈనేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యా సంవత్సరానికి ఎలాంటి అంతరాయం జరగకుండానే ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారని, అందుకే బదిలీలను చేపట్టేందుకు అన్ని విధివిధానాలను చేపడుతున్నట్టు మంత్రి బొత్స వెల్లడించారు.
ap minister Botsa Satyanarayana good news to govt teachers
త్వరలోనే సీఎం జగన్ తో చర్చించి ఉపాధ్యాయ బదిలీలపై విధివిధానాలు ప్రకటిస్తామని ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని దానికి సంబంధించి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి చెప్పారు. ఉపాధ్యాయ బదిలీలతో పాటు విద్యారంగంలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. డీఎస్సీ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఉపాధ్యాయుల ఖాళీలపై కూడా లెక్కలు తీస్తున్నామని.. ఖాళీలు దాదాపు 15 వేలు ఉన్నాయని అన్నారు. అలాగే.. కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామని బొత్స స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారన్నారు.
minister botsa satyanarayana gives clarity on ap capital
సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామన్నారు. అలాగే.. రాజధాని విషయంలోనూ ఎలాంటి మార్పు లేదని.. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామన్నారు బొత్స. త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతోందన్నారు. మూడు రాజధానులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బొత్స గట్టిగానే బదులిచ్చారు. గతంలో చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ లో ఎలా కాపురం చేశారంటూ ప్రశ్నించారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ పాలసీ అని, అందుకే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తున్నట్టు, అమరావతిలో శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నట్టు తెలిపారు.
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
This website uses cookies.