
army hospital reports revealed of ysrcp mp raghurama krishnam raju
Raghurama case : ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆయన చేసిన విమర్శలకు, అకారణంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంపై ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత సీఐడీ అధికారులు విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గుంటూరులోని మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తికి రఘురామకృష్ణంరాజు లిఖిత పూర్వకంగా లేఖ కూడా రాశారు. తనను విచారణ పేరుతో సీఐడీ అధికారులు తీవ్రంగా కొట్టారని ఆయన ఫిర్యాదు చేశారు.
army hospital reports revealed of ysrcp mp raghurama krishnam raju
దీంతో.. రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించి.. రిపోర్టు అందించాలంటూ… న్యాయమూర్తి మెడికల్ బోర్డును ఆదేశించారు. అయితే.. మెడికల్ బోర్డు తరుపున వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని.. అది ఎడిమా అనే సమస్య వల్ల కాళ్లు నల్లబడ్డాయని తెలిపారు. అయితే.. కావాలని డాక్టర్లు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని.. తన తండ్రికి ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ రఘురామ కొడుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో వెంటనే సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. దాని ప్రకారం.. ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్టును హైకోర్టు రిజిస్ట్రార్ కు పంపించగా.. రిజిస్ట్రార్ ఆ రిపోర్టును సుప్రీం కోర్టుకు పంపించారు. తాజాగా శుక్రవారం ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగగా… ఆ రిపోర్టును కోర్టు పరిశీలించింది. ఆర్మీ డాక్టర్లు పంపించిన రిపోర్టులో ఎక్స్ రే, రిపోర్టు, వీడియో ఉన్నట్టు సుప్రీం తెలిపింది.
అయితే.. రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్.. రఘురామపై దాడి జరిగిందని… జనరల్ ఎడిమాతో పాటు ఆయన కాలికి గాయాలున్నట్టు రిపోర్టులో ఉందని పేర్కొన్నారు. వెంటనే రఘురామకృష్ణంరాజు తరుపు లాయర్ ముకుల్ రోహిత్గీ తమ వాదనలను సుప్రీంకోర్టుకు వినిపించారు. ఒక ఎంపీనే ఇలా కస్టడీలో చిత్రహింసలకు గురి చేస్తే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలొద్దు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి.. అని కోర్టును ముకుల్ కోరారు.
ఏపీ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన.. దుష్యంత్ దవే.. గాయాలు నిజమే అయినప్పుడు అవి ఆయన చేసుకున్నవా? కాదా? అనేది కూడా తేలాల్సి ఉంది.. అని కోర్టుకు తెలిపారు. అయితే.. దుష్యంత్ వాదనలపై స్పందించిన కోర్టు.. ఆసుపత్రికి వెళ్లేముందు.. ఎంపీనే స్వయంగా గాయాలను చేసుకున్నారా? అని ప్రశ్నించింది. రిపోర్టులను ఏపీ ప్రభుత్వానికి, లాయర్లకు మెయిల్ చేస్తామని కోర్టు తెలిపింది.
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
This website uses cookies.