
army hospital reports revealed of ysrcp mp raghurama krishnam raju
Raghurama case : ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆయన చేసిన విమర్శలకు, అకారణంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంపై ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత సీఐడీ అధికారులు విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గుంటూరులోని మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తికి రఘురామకృష్ణంరాజు లిఖిత పూర్వకంగా లేఖ కూడా రాశారు. తనను విచారణ పేరుతో సీఐడీ అధికారులు తీవ్రంగా కొట్టారని ఆయన ఫిర్యాదు చేశారు.
army hospital reports revealed of ysrcp mp raghurama krishnam raju
దీంతో.. రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించి.. రిపోర్టు అందించాలంటూ… న్యాయమూర్తి మెడికల్ బోర్డును ఆదేశించారు. అయితే.. మెడికల్ బోర్డు తరుపున వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని.. అది ఎడిమా అనే సమస్య వల్ల కాళ్లు నల్లబడ్డాయని తెలిపారు. అయితే.. కావాలని డాక్టర్లు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని.. తన తండ్రికి ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ రఘురామ కొడుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో వెంటనే సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. దాని ప్రకారం.. ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్టును హైకోర్టు రిజిస్ట్రార్ కు పంపించగా.. రిజిస్ట్రార్ ఆ రిపోర్టును సుప్రీం కోర్టుకు పంపించారు. తాజాగా శుక్రవారం ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగగా… ఆ రిపోర్టును కోర్టు పరిశీలించింది. ఆర్మీ డాక్టర్లు పంపించిన రిపోర్టులో ఎక్స్ రే, రిపోర్టు, వీడియో ఉన్నట్టు సుప్రీం తెలిపింది.
అయితే.. రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్.. రఘురామపై దాడి జరిగిందని… జనరల్ ఎడిమాతో పాటు ఆయన కాలికి గాయాలున్నట్టు రిపోర్టులో ఉందని పేర్కొన్నారు. వెంటనే రఘురామకృష్ణంరాజు తరుపు లాయర్ ముకుల్ రోహిత్గీ తమ వాదనలను సుప్రీంకోర్టుకు వినిపించారు. ఒక ఎంపీనే ఇలా కస్టడీలో చిత్రహింసలకు గురి చేస్తే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలొద్దు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి.. అని కోర్టును ముకుల్ కోరారు.
ఏపీ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన.. దుష్యంత్ దవే.. గాయాలు నిజమే అయినప్పుడు అవి ఆయన చేసుకున్నవా? కాదా? అనేది కూడా తేలాల్సి ఉంది.. అని కోర్టుకు తెలిపారు. అయితే.. దుష్యంత్ వాదనలపై స్పందించిన కోర్టు.. ఆసుపత్రికి వెళ్లేముందు.. ఎంపీనే స్వయంగా గాయాలను చేసుకున్నారా? అని ప్రశ్నించింది. రిపోర్టులను ఏపీ ప్రభుత్వానికి, లాయర్లకు మెయిల్ చేస్తామని కోర్టు తెలిపింది.
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
This website uses cookies.