Venu Swamy : 2024 తర్వాత ఏపీలో ఇక ఆ పార్టీ ఉండదు.. వేణు స్వామి వ్యాఖ్యలు వైరల్

 Authored By kranthi | The Telugu News | Updated on :6 January 2023,3:00 pm

Venu Swamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలుసు కదా. ప్రముఖ సినీ, రాజకీయ నేతల గురించి పలు వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ అయిన విషయం తెలుసు కదా. ఆ సెలబ్రిటీకి ఇలా.. ఆ సెలబ్రిటీకి ఇలా జరుగుతుంది అంటూ చెప్పి అందరినీ విస్మయానికి గురి చేసిన వేణు స్వామి తాజాగా మరి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చివరకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

తాజాగా.. రాజకీయ నాయకుల గురించి చెప్పుకొచ్చారు. అది కూడా ఏపీ రాజకీయ నాయకుల గురించి వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఏపీలో 2024 లో ఒక ప్రధాన పార్టీ కనుమరుగు అయిపోతుంది అని బల్లగుద్ది మరీ చెప్పుకొచ్చారు వేణు స్వామి. అయితే.. త్వరలో ఏపీ రాజకీయాల్లో ఏలినాటి శని మొదలవుతోందని చెప్పుకొచ్చారు. ఏలినాటి శని మొదలవడం వల్ల…

astrologer venu swamy talks about ap political party

astrologer venu swamy talks about ap political party

Venu Swamy : మారనున్న రాజకీయ నాయకుల భవిష్యత్తు

ఏపీలో రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా మారుతుందని.. అందులో భాగంగానే ఏపీలో ఒక పార్టీ.. అది కూడా ఇది వరకు అధికారంలో ఉన్న ప్రధాన పార్టీ కనుమరుగు కానుందని చెప్పుకొచ్చారు వేణు స్వామి. ఇంతకీ ఆ పార్టీ ఏది… అసలు 2024 లో ఏ పార్టీ కనుమరుగు కాబోతోంది.. ఒకవేళ ఆయన చెప్పిన పార్టీ కనుమరుగు అయితే.. మరి ఏపీలో గెలిచే పార్టీ ఏది అంటూ ఏపీ ప్రజలు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి