Bairi Naresh : తెలంగాణలోని ఎర్రవరం లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి పెద్ద చర్చ నడుస్తుంది. ఎర్రవరం లోని ఒక గుట్టపై బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిశాడని, ఆ ఆలయానికి వెళ్లి ఏం కోరుకుంటే అది జరుగుతుందని అక్కడి భక్తులు నమ్ముతున్నారు. అలాగే అక్కడ ఒక బాలుడు పై ఉగ్ర నరసింహ స్వామి పూనడంతో అతడు ఏం చెబితే అది జరుగుతుందని చెబుతున్నారు. ఆ బాలుడు అక్కడ పుట్టపైన బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిశాడని చెప్పడంతో ఆ ఊరి ప్రజలంతా అక్కడికి వెళ్లి చూశారు. నిజంగానే గుట్టపై దేవుడు వెలిశాడని ప్రజలు పూజలు చేయడం ప్రారంభించారు.
అలాగే చాలామంది తమ కోరికలు నెరవేరాయని కూడా చెప్పారు. అక్కడికి వెళ్ళి ఏం కోరుకుంటే అది జరుగుతుందని చెబుతుండడంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలే కాదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వెళుతున్నారు. లక్షల సంఖ్యలో ప్రతిరోజు భక్తులు దర్శనం ఇస్తున్నారు. ప్రతి శుక్రవారం చాలా రద్దీగా ఉంటుంది. అయితే ఆ గుడిపై ప్రముఖ నాస్తికుడు బైరి నరేష్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అసలు అక్కడ దేవుడు అనేది లేదన్నారు. బాల ఉగ్ర నరసింహ స్వామి అనేది అంత బూటకం అన్నారు.
అక్కడికి వెళ్లి ప్రెగ్నెంట్ కావాలని కోరుకుంటే అది నిజం అవుతుందా. వినడానికి నవ్వు వస్తుంది. భర్తతో కాపురం చేస్తే వస్తుందా లేక ఆ బాలుడు చెప్పాడని ప్రెగ్నెంట్ రావడం ఏంటి అని ప్రశ్నించారు. అలాగే ఇంకా చాలామంది ఈ గుడికి వచ్చాక నాకు క్యాన్సర్ తగ్గిపోయిందనీ, నాపై ఉన్న కేసులు అన్ని తొలగిపోయానని చెప్పడం చాలా ఫన్నీగా ఉంది. మీరు ఎప్పటినుంచో ఆ కేసు గురించి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇప్పుడు సాల్వ్ అయింది అంతేకానీ దేవుడే చేయలేదు అని అన్నారు. వంద ఛానళ్లు ఆ ఉగ్ర నరసింహ స్వామి గురించి చెప్పారు కానీ తెర వెనుక అసలు ఏం జరుగుతుందో చెప్పరు. ఎందుకంటే ఆ ఊరి ప్రజలు తరిమేస్తారు కాబట్టి అంటూ బైరినరేష్ కామెంట్స్ చేశారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.