Balineni : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అంతే కాదు.. ఎన్నికల కంటే కూడా ముందు పార్టీలలో ఒకరికి మరొకరు టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఒంగోలు జిల్లా వైసీపీ పార్టీలో ముసలం మొదలైనట్టు తెలుస్తోంది. అది కూడా ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న వైరమే ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశం అయింది.
పార్టీలో ఈ విషయం రోజురోజుకూ చర్చనీయాంశం అవుతుండటంతో బాలినేని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ భావోద్వేగానికి గురయ్యారు. కావాలనే తనను కొందరు వ్యక్తులు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్నారని వాపోయారు. పార్టీ ఏర్పాటు నుంచి జగన్ కు నమ్మకస్తుడిలా, తన వెన్నంటే ఉన్న తనను కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఈ ఇద్దరూ సీఎం జగన్ కు కావాల్సిన వాళ్లే. ఈ ఇద్దరూ పార్టీని జిల్లాలో కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే కాదు.. ఈ ఇద్దరు కూడా బంధువులే. వరుసకు బావ బామ్మార్దులు అవుతారు. కానీ..
బంధుత్వాన్ని పక్కన పెట్టి ఇద్దరూ ఇప్పుడు బద్ధ శత్రువులు అయిపోయారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ మధ్య బాలినేని మంత్రి పదవి పోవడంతో ఆయన కాస్త అసంతృప్తికి లోనయినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డిని తప్పించి.. ఆదిమూలపు సురేశ్ ను మంత్రిగా కొనసాగించడంపై ఆయన అసంతృప్తి ఉన్నారు. ఆయన మంత్రి పదవి పోవడానికి కారణం వైవీ సుబ్బారెడ్డి అని తెలిసి.. ఇద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 2014 నుంచి వైసీపీకి నమ్మకస్తులుగా ఉండటంతో పాటు.. ఒంగోలులో వీళ్లదే రాజ్యం. 2014 లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని పోటీ చేయగా ఓడిపోయారు. కానీ.. వైసీపీ నుంచి పోటీ చేసిన సుబ్బారెడ్డి మాత్రం గెలిచారు. తన ఓటమికి వైవీ సుబ్బారెడ్డే కారణమని అప్పటి నుంచి వీళ్ల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అవి భగ్గుమన్నాయి.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.