Bandi Sanjay : కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు తెలంగాణ మెడకు చుట్టుకుంది. బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారనే వార్తలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. ఇదే విషయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మాట్లాడారు.
మల్కాజ్ గిరిలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్… డ్రగ్స్ కేసుపై సంచలన విషయాలను బయటపెట్టారు.
డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని… ఆ ఎమ్మెల్యేలు ఎవరో కూడా సీఎం కేసీఆర్ కు తెలుసని బండి సంజయ్ అన్నారు. వాళ్లలో సీఎం కేసీఆర్ రాజీనామా చేయించాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ పార్టీ తన ఏడేళ్ల పాలనలో ఎన్నో అక్రమాలకు పాల్పడింది. క్లబ్బులు, పబ్బులు, గుట్కా, మట్కా, ఇసుక మాఫియా, లాండ్ మాఫియాకు తెర లేపింది. తాజాగా డ్రగ్స్ దందాకు తెర లేపింది. కరోనా పరీక్షలు నిర్వహించినట్టే… అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలకు రక్త పరీక్ష చేయిస్తే అసలు దొంగలు ఎవరో తేలిపోతుంది.. అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
బెంగళూరు డ్రగ్స్ కేసులాగానే.. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లోనూ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. ఆ కేసు అప్పుడే అటకెక్కింది. దాని గురించి కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.. అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నా… కేసీఆర్ మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఆ వార్తలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు. కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? అది నిజమనేగా? వాళ్లు ఎవరో కూడా కేసీఆర్ కు తెలుసు. వారితో వెంటనే రాజీనామా చేయిస్తేనే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు. కానీ.. వాళ్లను కాపాడాలని చూస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు.. అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.