
bjp and janasena party alliance in andhra pradesh
పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీలోని రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి… 2019 ఎన్నికల్లో పోటీ చేయడం.. తర్వాత కొన్ని రోజులు పార్టీలో సైలంట్ అయిపోవడం.. ఇటీవలే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం. తాజాగా బీజేపీతో మళ్లీ అంటీముట్టనట్టే పవన్ ఉంటున్నారు అనేది మరో టాక్.
bjp and janasena party alliance in andhra pradesh
బీజేపీ, జనసేన పార్టీలు ఒక్కటేనని… భవిష్యత్తులో ఏ విషయంలోనైనా.. ఈ రెండు పార్టీలు ఒకే మార్గంలో నడుస్తాయని బీజేపీకి మద్దతిస్తూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ.. అది ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
దానికి ప్రత్యక్ష ఉదాహరణ.. జీహెచ్ఎంసీ ఎన్నికలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తోందంటూ ప్రకటించారు పవన్. ఆ ప్రకటన వచ్చి రెండురోజులు అయిందో లేదో.. జనసేన ఈ సారి పోటీ చేయడం లేదు… బీజేపీకి మాత్రం మద్దతు ఇస్తుంది అన్నారు. అంటే అక్కడ బీజేపీ నుంచి పవన్ ను ఒత్తిళ్లు వచ్చాయని.. అందుకే జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉపసంహరించుకుందంటూ వార్తలు వచ్చాయి.
కట్ చేస్తే… ఇప్పుడు ఏపీలో తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పోతే పోయింది.. తిరుపతిలో అయినా ఒంటరిగా పోటీ చేసి జనసేన సత్తా చూపించుకోవాలి… అని తెగ ఆరాటపడుతోంది జనసేన పార్టీ. ఎలాగైనా తిరుపతిలో పోటీ చేయాలి.. ఒంటరిగా పోటీ చేసి.. తమ సత్తా చాటాలి అని పవన్ తెగ ఆరాటపడుతున్నారు.
అందుకే.. ఇప్పటికే ఆయన నివర్ తుపాను బాధితులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఒకరోజు నిరసన చేపట్టారు. దీంట్లో బీజేపీ ఇన్వాల్వ్ మెంట్ ఏం లేదు. జనసేన ఎలాగైతే తిరుపతిలో పోటీ చేయాలని అనుకుంటుందో… బీజేపీ కూడా పోటీ చేయాలని భావిస్తోంది. అదే అక్కడ ఈ రెండు పార్టీల మధ్య ఉన్న సఖ్యతను దెబ్బతీస్తోంది.
దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి.. మరింత ఉత్సాహంతో బీజేపీ ఉంది. అదే ఉత్సాహంతో తిరుపతి ఉపఎన్నికల్లోనూ గెలిచి… ఏపీలో పాగా వేయాలనేది బీజేపీ ప్లాన్. సేమ్… జనసేన కూడా తిరుపతి ఉపఎన్నికల్లో గెలిచి ఏపీలో తమ సత్తా చాటాలని అనుకుంటోంది.
ఇటువంటి నేపథ్యంలో ఎవరు కాంప్రమైజ్ అవుతారు. ఎవరు అవ్వరు.. అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ.. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ, జనసేన రెండూ వేర్వేరుగా పోటీ చేస్తే.. ఇక రెండు పార్టీలు రాం రాం చెప్పుకున్నట్టే. చూద్దాం.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో?
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.