ఏపీలో ప్రస్తుతం అమరావతి ఉద్యమం జోరుమీదుంది. అక్కడి స్థానికులు చేసే ఈ ఉద్యమం ఏపీ సీఎం జగన్ కు దింగమింగుడుగా మారింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నారు. ఓవైపు అభివృద్ధి అంటూ మూడు రాజధానులను ప్రకటిస్తే.. అమరావతి రైతులు మాత్రం ఒకే రాజధాని ముద్దు అంటూ గత కొన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు.
ఆ ఉద్యమాన్ని ఎలా అణిచివేయాలో తెలియక సీఎం జగన్ సతమతమవుతున్నారు. ఇన్ని రోజులు అమరావతి ఉద్యమాన్ని కాస్త లైట్ తీసుకున్న జగన్.. ఇప్పుడు మాత్రం సీరియస్ గా ఉన్నారట. ఉద్యమాన్ని కట్టడి చేయడం కోసం.. దానిపై ఫోకస్ పెట్టారట.
కట్ చేస్తే.. బీజేపీ పార్టీ.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో బలంగా పాతుకుపోతోంది. తెలంగాణతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలోనూ పాగా వేయాలని చూస్తోంది. అందుకే తెలంగాణతో పాటు ఏపీపై కూడా ఫోకస్ పెట్టింది బీజేపీ.
అందుకే.. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ… అమరావతి ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ప్రస్తుతం ఏపీలోనూ బీజేపీకి స్పేస్ ఉంది. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఇదే సరైన సమయం అని భావిస్తోంది.
అందులో భాగంగానే జనసేనతో బీజేపీ జతకట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఏపీలో ఎక్కువగా పర్యటనలు చేస్తున్నారు. అమరావతి ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
అమరావతి ఉద్యమం ప్రస్తుతం అమరావతి ప్రాంతంలోనే జరుగుతోంది. దాన్ని రాష్ట్రమంతా విస్తరించేలా చేసేందుకు రైతులకు బీజేపీ మద్దతు ప్రకటించే అవకాశం కూడా ఉందని.. దీని వల్ల జగన్ ను తీవ్రంగా ఇరుకులో పెట్టొచ్చని బీజేపీ భావిస్తోందట. చూద్దాం మరి.. భవిష్యత్తులో అమరావతి ఉద్యమం ఎంత దూరం వెళ్తుందో? బీజేపీ దాన్ని అనుకూలంగా మార్చుకొని ఏపీ ప్రజల విశ్వాసాన్ని ఎలా చూరగొంటుందో?
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.