kcr
BJP Laxman : ప్రస్తుతం తెలంగాణ వ్యాఫ్తంగా కరోనా మహమ్మారి విపరీతంగా విస్తరించింది. ఎక్కడ చూసినా కేసులే. రోజురోజుకూ కేసులు రెట్టింపు అవుతున్నాయి. బెడ్లు లేవు… ఆక్సీజన్ సిలిండర్లు నిండుకున్నాయి. ఏ ఆసుపత్రికి వెళ్లినా కరోనా పేషెంట్లతో ఫుల్ అయిపోయింది. ఈనేపథ్యంలో కరోనాను తరిమికొట్టాలంటే జాగ్రత్తలు పాటించడం తప్పితే చేసేదేం లేదు. అయితే… కరోనా పోరులో ప్రభుత్వం కూడా ప్రజలతో కలిసి పనిచేయాలి. కానీ… ప్రభుత్వం ఎన్నికల మీద చూపెడుతున్న శ్రద్ధను కరోనా వైరస్ ను తరిమికొట్టడంలో చూపించడం లేదంటూ బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు.
bjp laxman on telangana govt
లక్ష్మణ్… తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల మీద ఉన్న సోయి వీళ్లకు ప్రజల మీద.. వాళ్ల ఆరోగ్యం మీద లేదని దుయ్యబట్టారు. ఓవైపు రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుంటే… రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఎన్నికలకే పోతామంటోంది. ఇలా మొండిగా ప్రవర్తించి ప్రజల ఆరోగ్యంతో చెలగాడం ఆడుతున్నారా? అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.
bjp laxman on telangana govt
మీకు ఎన్నికలే ముఖ్యం కావచ్చు. కానీ… బీజేపీకి మాత్రం ఎన్నికల కంటే కరోనాను నియంత్రించడమే ముఖ్యం. ఎన్నికలు మాకు ముఖ్యం కాదు. ఎన్నికలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం కరెక్ట్ కాదు. ప్రతి 10 మందిలో నాలుగు నుంచి ఐదుగురికి కరోనా పాజిటివ్ వస్తోంది. మీ బేషజాలను పక్కన పెట్టండి. ముందు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలను వాయిదా వేయండి. ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించండి. కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్నాయి. కృత్రిమంగా బెడ్స్ కొరతను సృష్టిస్తున్నారు. వెంటిలేటర్లు లేవు… డాక్టర్లు సరిపడా లేరు. ఆరోగ్య మంత్రి కూడా చేతులెత్తేశారు. కనీసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేకపోయారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అయినా తెలంగాణ కొనసాగిస్తే బెటర్… అంటూ లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
This website uses cookies.