BJP Laxman : ప్రస్తుతం తెలంగాణ వ్యాఫ్తంగా కరోనా మహమ్మారి విపరీతంగా విస్తరించింది. ఎక్కడ చూసినా కేసులే. రోజురోజుకూ కేసులు రెట్టింపు అవుతున్నాయి. బెడ్లు లేవు… ఆక్సీజన్ సిలిండర్లు నిండుకున్నాయి. ఏ ఆసుపత్రికి వెళ్లినా కరోనా పేషెంట్లతో ఫుల్ అయిపోయింది. ఈనేపథ్యంలో కరోనాను తరిమికొట్టాలంటే జాగ్రత్తలు పాటించడం తప్పితే చేసేదేం లేదు. అయితే… కరోనా పోరులో ప్రభుత్వం కూడా ప్రజలతో కలిసి పనిచేయాలి. కానీ… ప్రభుత్వం ఎన్నికల మీద చూపెడుతున్న శ్రద్ధను కరోనా వైరస్ ను తరిమికొట్టడంలో చూపించడం లేదంటూ బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు.
లక్ష్మణ్… తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల మీద ఉన్న సోయి వీళ్లకు ప్రజల మీద.. వాళ్ల ఆరోగ్యం మీద లేదని దుయ్యబట్టారు. ఓవైపు రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుంటే… రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఎన్నికలకే పోతామంటోంది. ఇలా మొండిగా ప్రవర్తించి ప్రజల ఆరోగ్యంతో చెలగాడం ఆడుతున్నారా? అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.
మీకు ఎన్నికలే ముఖ్యం కావచ్చు. కానీ… బీజేపీకి మాత్రం ఎన్నికల కంటే కరోనాను నియంత్రించడమే ముఖ్యం. ఎన్నికలు మాకు ముఖ్యం కాదు. ఎన్నికలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం కరెక్ట్ కాదు. ప్రతి 10 మందిలో నాలుగు నుంచి ఐదుగురికి కరోనా పాజిటివ్ వస్తోంది. మీ బేషజాలను పక్కన పెట్టండి. ముందు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలను వాయిదా వేయండి. ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించండి. కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్నాయి. కృత్రిమంగా బెడ్స్ కొరతను సృష్టిస్తున్నారు. వెంటిలేటర్లు లేవు… డాక్టర్లు సరిపడా లేరు. ఆరోగ్య మంత్రి కూడా చేతులెత్తేశారు. కనీసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేకపోయారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అయినా తెలంగాణ కొనసాగిస్తే బెటర్… అంటూ లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.