
BJP To Give Super Shock To TRS Soon?
BJP – TRS : ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటుండకూడదు. కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాజకీయ నాయకులపై దాడులు జరుగుతుంటాయి. అలా దాడులు చేసేవాళ్ళు సామాన్యులేనని కొందరు వాదిస్తుంటారు.. అది రాజకీయ దాడి అని మరికొందరు అంటుంటారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతల మీద దాడులు ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్నాయి. మొన్నామధ్య ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీద కూడా దాడి జరిగింది. అసలు ఈ దాడుల వెనుక వుండేదెవరు.? పబ్లిసిటీ కోసం ఇలాంటి దాడులు చేస్తుంటారా.? రాజకీయ ప్రేరేపిత దాడులా.? ప్రజలు, నాయకుల మీద దాడులు చేసే పరిస్థితి వుండదు.
వుంటే, ఏ రాజకీయ నాయకుడు కూడా రోడ్ల మీద తిరగడన్నది ప్రజాస్వామ్యవాదులు చెప్పేమాట. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీద దాడి జరిగింది. నియోజకవర్గంలో వదరల పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన వెళ్ళగా, కొందరు ఆయన్ని అడ్డుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం సహా, ఆయన వెంట వచ్చిన పలు వాహనాలపై దాడులు చేశారు. ఈ దాడులపై బీజేపీ నేతలు గుస్సా అయ్యారు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర సమితి నడుపుతున్న దాడుల డ్రామా..
BJP Vs TRS, New Drama In Telangana
అన్నది బీజేపీ ఆరోపణ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై స్పందించారనీ, ధర్మపురి అరవింద్తో మాట్లాడారనీ బీజేపీ చెబుతోంది. అస్సలేమాత్రం తగ్గొద్దని బీజేపీ అధినాయకత్వం, బీజేపీ తెలంగాణ నేతలకు సూచించిందట. గతంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మీద కూడా దాడి యత్నాలు జరిగాయి. వీటిని తెలంగాణ రాష్ట్ర సమితి చేయిస్తోందని కమల నాథులు ఆరోపిస్తోంటే, ప్రజలే నిలదీస్తున్నారని గులాబీ పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. ఏది నిజం.? అన్నది ఆ పైవాడికే ఎరుక. కానీ, ఈ దాడుల రాజకీయం మాత్రం సబబు కాదు.
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…
This website uses cookies.