New Rules for Farmers : రైతులకు కేంద్రం ప్రభుత్వం కొత్త రూల్.. పొలానికి వెళ్లడానికి ఇవ్వకపోతే..!
New Rules for Farmers : దేశంలో రైతులు ఎదుర్కొంటున్న మరో సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇప్పటికీ గ్రామాల్లో చాలా మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు అంతేకాదు వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడానికి వారి పొలాలకు ప్రాప్యత అనేది చాలా కీలకం. ఐతే దీని వల్ల ఇరుగు పొరుగు ఉన్న భూ యజమానులు తమ భూమి గుండా వెళ్లేందుకు ఇబ్బందులు పెడుతుంటారు కొంతమంది రైతులు వీటి వల్ల అనుకోని సవాళ్లను […]
ప్రధానాంశాలు:
New Rules for Farmers : రైతులకు కేంద్రం ప్రభుత్వం కొత్త రూల్.. పొలానికి వెళ్లడానికి ఇవ్వకపోతే..!
New Rules for Farmers : దేశంలో రైతులు ఎదుర్కొంటున్న మరో సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇప్పటికీ గ్రామాల్లో చాలా మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు అంతేకాదు వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడానికి వారి పొలాలకు ప్రాప్యత అనేది చాలా కీలకం. ఐతే దీని వల్ల ఇరుగు పొరుగు ఉన్న భూ యజమానులు తమ భూమి గుండా వెళ్లేందుకు ఇబ్బందులు పెడుతుంటారు కొంతమంది రైతులు వీటి వల్ల అనుకోని సవాళ్లను ఎదుర్కొంటారు. పొరుగు వారిని దాటి వారి పొలాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఫేస్ చేస్తారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం మారం యొక్క హక్కుని ప్రవేశ పెట్టింది. ఈజ్ మెంట్ చట్టం ద్వారా ప్రాముఖ్యతను హైలెట్ చేస్తారు.
New Rules for Farmers పొరుగు లేదా పైన ఉన్న భూ యజమానుల సౌలభ్యం కోసం..
ఈజ్మెంట్ ఆఫ్ నెసెసిటి తో ఒక రైతు భూమి మరొక పొలానికి వెనుక ఉంటే.. ముందు పొలం యజమాని వెనుక వారి పొలాన్ని యాక్సెస్ చేయడానికి తప్పనిసరిగా మార్గాన్ని చూపించాలి. దీనికి చట్టపరమైన ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు. పొరుగున ఉన్న భూ యజమానులు యాక్సెస్ ఇవ్వడానికి నిరాకరిస్తే వారు చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది. అంతేకాదు రైతులు త్మ భూమికి కావాల్సిన భద్రత కల్పించేందుకు ఈసీ చట్టంలో ఈజ్ మెంట్ నెస్సిసిటీ చట్టం ఉపయోగపడుతుంది.
ఇక పొలానికి సంబందించిన చారిత్రాత్మకంగా ఒక మార్గం ఉంటే ముందు తరాలు ఉపయోగించినా లేదా మూసివేయబడిన తిరిగి అదే మార్గాన్ని తీసుకు రావాలన్ హక్కు రైతుకి ఉంటుంది. దీనికి అద్దె చట్టం లో సెక్షన్ 251 ప్రకారం రైతులు తమ పొలానికి వేరే మార్గం అందుబాటులో లేకపోతే కొత్త మార్గాన్ని నిర్మించుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. ఐతే ఈ నిబంధనలు రైత్లకు భూమిని పొందే హక్కు పరిరక్షించడానికి వ్యవసాయ ఉపకరణాలను, ఉత్పత్తిని అడ్డంకులు లేకుండా రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. రైతులకు ముఖ్యంగా ఇలా పొరుగు లేదా పైన ఉన్న భూమి యజమానుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి అందుకే వీటికి కూడా కొత్త చట్టం తెచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం.