YS Jagan : చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఓపెన్ ఛాలెంజ్‌..175కి 175 సీట్ల‌లో పోటీ చేసే ధైర్యం ఉందా.. సీఎం జ‌గ‌న్‌..!

Advertisement
Published by
Advertisement

YS Jagan : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా వాచా నమ్మి రైతన్నకు పెట్టుబడి సాయం రూపంలో ఆర్థిక సాధికారత అందించడమే ధ్యేయంగా మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతన్న విత్తనం నాటిన నాటి నుంచి పంటను మద్ధతు ధరకు అమ్మే వరకు తోడుగా ఉండి రైతు సుభిక్షం కోరుకునే ఏకైక ప్రభుత్వం మనదేనని వివరించారు. వైఎస్సార్ రైతు భరోసా నాలుగో ఏడాది మూడో విడత ఆర్థిక సాయం విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. తెనాలిలో నిర్వహించిన ఈ బహిరంగ సభలో సీఎం జగన్ 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మూడో విడత సాయం అందిస్తున్న రూ. 2 వేల మొత్తాన్ని బటన్ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లో జమచేశారు. నాలుగో ఏడాదికి సంబంధించి గత రెండు విడతల్లో రూ. 7,500 మరియు రూ. 4000 ను ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. మూడో విడద సాయం కింత రూ. 1090.76 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమచేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.

Advertisement

దీంతో పాటు డిసెంబర్ లో సంభవించిన మాండూస్ తుఫాన్ కారణంగా నష్ట పోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యాన వన రైతులకు రూ. 76.99 కోట్ల మొత్తాన్ని సీఎం జగన్ ఆయా రైతుల ఖాతాల్లో జమచేశారు. మూడున్నరేళ్లలో 22 లక్షల రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ సాయం అందించామని వివరించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ రైతు భరోసా కార్యక్రమం ద్వారా కోటిన్నర కుంటుంబాలకు మంచి జరుగుతోందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా ఒక్కో రైతన్నకు రూ. 13, 500 రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల హామీలో పేర్కొన్న రూ. 12, 500 కంటే అదనంగా మరో రూ. 1000 ను అధికారంలోకి వచ్చిన నాటి ఖచ్ఛితంగా అందిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పథకం కింద మేలో రూ. 7,500 అక్టోబర్ లో రూ. 4000 ఫిబ్రవరి రూ. 2000 అందిస్తున్నట్లు సీఎం జగన్ బహిరంగ సభలో పేర్కొన్నారు.

Advertisement

CM Jagan Challenge To Chandrababu And Pawan Kalyan

ఈ రోజు అందించిన సాయంతో కలిపితే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఈ నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ. 54 వేల లబ్ధి చేకూరిందని వివరించారు. వచ్చే ఏడాది అందించే మొత్తం కలిపి ఐదేళ్లలో రూ. 67,500 సాయం రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి అందించినట్లు అవుతుందన్నారు. తమ ప్రభుత్వం కేవలం రైతు భరోసా పథకం కోసమే కోసం రూ. 27,062 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. రైతులన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సగర్వంగా ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. వ్యవసాయం అంటే రైతుల బాగు కోరడమేనని ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో పంట నష్ట పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. సాయంలో చంద్రబాబులా మాయలు, మోసాలు లేవు ఆహార భద్రతతో పాటు 62 శాతం మంది ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం అంటే వైఎస్సార్ సీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని గౌరవం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.

రైతు రైతు కూలీలతో కలిపిన వ్యవసాయం బాగుంటేనే రాష్ర్టం బాగుటుందన్నారు. రైతులకు అందించే సాయంతో కోతలు విధించి ఖర్చు తగ్గించుకునే మాయలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎంత మాత్రం లేవని సీఎం జగన్ అన్నారు. ఆ మాయలు, మోసాలుకేవలం చంద్రబాబు మాత్రమే చేయగలరని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో నవరత్నాల కింద ప్రజలకు అందించిన సాయాన్ని ఒక్క సారి అందరూ గమనించాలని సీఎం జగన్ విజ్ణప్తి చేశారు. టీడీపీ హయాంలో కరువుపై యుద్ధం పేరుతో తెచ్చిన రెయిన్ గన్నుల అవినీతి లేదని, కేవలం రెయిన్ మాత్రమే ఉందని సీఎం జగన్ చలోక్తులు విసిరారు. కరువు వచ్చినా కూడా చంద్రబాబు ప్రభుత్వం రెయిన్ గన్నుల పేరుతో పేరుతో అవినీతికి పాల్పడటం దారుణమని సీఎం జగన్ పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఒక అన్యాయస్తుడు ముఖ్య మంత్రి గా ఉంటూ కరువును తోడు తెచ్చుకున్నారని విమర్శలు గుప్పించారు. ఈ నాలుగేళ్లలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించే అవసరం లేనంత సుభిక్షంగా ఉండటం వైఎస్సార్ సీపీ సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు.

CM Jagan Challenge To Chandrababu And Pawan Kalyan

కరువుకు కేరాఫ్ అడ్రస్.. చంద్రబాబు ఈ అన్యాయస్తుడు చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు కరువే ఉందని సీఎం జగన్ విమర్శించారు. రాష్ట్రం చరిత్రలో గతాన్ని చూస్తే చంద్రబాబు కరువు మాత్రమే కనిపిస్తుందన్నారు. 2019 నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేవుడి దయతో ఎక్కడా కరువులేదని వర్షాలు సుభిక్షంగా పడ్డాయని సీఎం పేర్కొన్నారు. మంచి మనసుతో పరిపాలన చేస్తే ఇలా ఉంటుందని టీడీపీకి సీఎం జగన్ చురకలంటించారు. ఈ నాలుగేళ్లలో ప్రతి ఒక్క గ్రామంలో చెరువులు నిండాయని, భూగర్భ జలాలు పెరిగాయన్నారు. చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం చూసినా ఎడారిగా మారుతుందని ప్రకటించిన అనంతపురం జిల్లాలో కూడా సుభిక్షంగా వర్షాలు పడ్డాయని వివరించారు. వర్షాలు పడటంతో పాటు నాలుగేళ్లలో పంట దిగుబడి 12 టన్నులు పెరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో పంట దిగుబడి 154 లక్షల టన్నులైతే వైఎస్సార్ సీపీ పరిపాలనలో 166 లక్షల టన్నులకు పెరిగిందన్నారు.

గత టీడీపీ పాలించిన ఐదేళ్లలో 2.65 కోట్ల టన్నులు ధాన్యం సేకరణ చేయగా, మూడున్నరేళ్లలో తమ ప్రభుత్వం 2.94 కోట్ల ధాన్యం సేకరించామని వివిరంచారు. ధాన్యం సేకరణ కోసం చంద్రబాబు ఐదేళ్లలో రూ. 40,230 కోట్లు ఖర్చు చేస్తే రూ. 55,400 కోట్లు ఖర్చు చేసామని సీఎం జగన్ వివరించారు. రైతుల పక్షాన నిలిచిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వల్ల ఈ మూడున్నరేళ్లలో ఉద్యానవన పంటలు 1.43,900 హెక్టార్ల విస్తీర్ణం పెరిగిందన్నారు. దిగుబడి తీసుకుంటే గతంలో ఏటా 228 లక్షల టన్నులు ఉండగా ఈ ప్రభుత్వంలో రైతన్నల కష్టం, ప్రభుత్వ క`షితో 332 లక్షల టన్నులు పెరిగిందని ఏకంగా 104 లక్షల టన్నుల అధిక దిగుబడి సాధించామని సీఎం జగన్ తెలిపారు. మన మంచి ప్రభుత్వాన్ని దేవుడు చూశాడు దేవుడు విన్నాడు, దేవుడు ఆశీర్వదించారని అందుకే ప్రతి ఇంట్లో అభివృద్ధి చూస్తున్నామని వివరించారు. దేశానికి ఆదర్శనీయంగా ఏపీలోని ఆర్బీకేలుఆర్బీకేలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని భావించడంతో పాటు, ఇతర దేశాల్లో కూడా అమలు చేయాలని ఆయా ప్రతినిధులు సందర్శించి వెళుతున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

Railway RRB exam dates 2026 changes : నిరుద్యోగులకు ముఖ్య గమనిక .. పారామెడికల్ పరీక్ష తేదీల్లో మార్పు .. కొత్త షెడ్యూల్ విడుదల ..!

Railway RRB exam dates 2026 changes : భారత రైల్వే శాఖలో పారామెడికల్ పోస్టుల భర్తీకి సంబంధించి కీలక…

32 minutes ago

New Rules for 1st March : వినియోగదారులకు అలర్ట్‌ .. నేటి నుంచి మారనున్న రూల్స్‌ ఇవే .. !

New Rules for 1st March : ప్రతి నెల మాదిరిగానే మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కొత్త…

2 hours ago

PM Kisan : రైతులకు నిరాశేనా ? .. కనీసం హోలీ పండుగ ముందైనా ఈ డబ్బులు వస్తాయా?

PM Kisan : దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్లకు పైగా రైతులు ప్రస్తుతం ఒకే ప్రశ్నతో ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ 22వ…

2 hours ago

Ali Khamenei killed | ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హతం: అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ప్రతీకార ప్రతిజ్ఞ

Ali Khamenei killed | అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్…

3 hours ago

Gold and Silver Rates 1st March 2026 : ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్.. రాత్రికి రాత్రే భగ్గుమన్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు భారీ షాక్

Gold and Silver Rates 1st March 2026 : పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌లో పసిడి ప్రియులకు ఊహించని షాక్…

4 hours ago

Pepper Chicken Fry : సండే స్పెషల్ .. పెప్పర్ చికెన్ ఫ్రై .. ఇలా కొత్తగా ట్రై చేసి తింటే .. మీరు ఎప్పటికీ మర్చిపోలేరు..!

Pepper Chicken Fry : సాధారణంగా చాలా మంది వారంలో కనీసం ఒకటి రెండు సార్లు అయినా చికెన్ వంటకాలు…

5 hours ago

Bitter Gourd : చేదుగా ఉందని కాకరకాయ తినడం లేదా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్సయినట్లే.. !

Bitter Gourd :  మన వంటింటిలో తరచుగా కనిపించే కూరగాయలలో కాకరకాయకు ప్రత్యేక స్థానం ఉంది. చేదు రుచితో ఉన్నప్పటికీ,…

6 hours ago

Good luck : అసలు అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుంది? .. సంపద వచ్చే ముందు ఇంట్లో కనిపించే శుభ సంకేతాలు ఇవేనా .. !

Good luck : అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరించుతుందో ముందుగానే చెప్పడం కష్టం. చాలామంది జీవితంలో ఒక్కసారైనా అదృష్టం…

7 hours ago

Miryalaguda : మిర్యాలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

Miryalaguda : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడలో వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను నేడు ఘనంగా…

16 hours ago

YS Jagan : కాపు ఓట్ల కోసం పెద్ద స్కెచ్ వేసిన జగన్ కి చావు దెబ్బ

YS Jagan : ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో…

17 hours ago

Nara Lokesh : CMగా లోకేష్ పట్టాభిషేకం , పవన్ కి ఇబ్బంది లేకుండా బంపర్ ఆఫర్.. కానీ..!

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

18 hours ago

Kalvakuntla Kavitha : కంట్లో నీళ్ళతో కెసిఆర్ ఇంటికి బయలుదేరిన కల్వకుంట్ల కవిత !

Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు…

19 hours ago