
ap cm ys jagan sacrifice for ap minister
YS Jagan : అమరావతి అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరం అవుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చేసిన పబ్లిసిటీ స్టంట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏమయ్యింది అమరావతి.? ఆ అమరావతి ఇప్పుడెలా వుంది.? అని ఆలోచిస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారణంగా అమరావతి ప్రాజెక్టు ఆగిపోయిందనే టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారమే కనిపిస్తుంది తప్ప, చంద్రబాబు హయాంలో కేవలం పబ్లిసిటీ తప్ప, పని జరగలేదన్న వాస్తవం బయటకు రాదు. వివిధ దేశాల్లో రాజధాని అమరావతి ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు బృందం విహార యాత్రలు చేసింది. బోల్డంత ప్రజా ధనాన్ని వృధా చేసింది.
ఆనాటి ఆ వృధా ఖర్చు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. అమరావతిలో అణు ఇంధన కర్మాగారం.. అని పాకిస్తాన్ మీడియా చెప్పుకునే స్థాయికి అమరావతిలో కొన్ని డిజైన్లను అప్పట్లో చంద్రబాబు గీయించడం చూశాం. దావోస్ పర్యటనలన్నారు, ఇంకేవేవో చెప్పారు. లక్షల కోట్ల పెట్టుబడులు, వాటికి ఒప్పందాలనీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. కానీ, వచ్చిన పెట్టుబడులెంత.? వాటి వల్ల రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎంత.? అంటే ఇప్పుడు టీడీపీ పెదవి విప్పలేదు, విప్పదు కూడా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళుతున్నారన్న విషయం ఖరారయ్యాక, టీడీపీ అలాగే టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం తీవ్రస్థాయిలో మొదలు పెట్టింది.
YS Jagan Davos Tour, TDP Mark Negativity
కోర్టు నుంచి అనుమతి తీసుకుంటే తప్ప, విదేశాలకు వెళ్ళలేని ముఖ్యమంత్రి.. అని కూడా ఎగతాళి చేశారు. ఈ తరహా విమర్శల్ని వైఎస్ జగన్ ఓపికగా భరించారు. రాష్ట్రం కోసం తాను చెయ్యాల్సినదల్లా చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఆర్భాటంలా కాకుండా, హుందగా దావోస్ బయల్దేరారు. అక్కడ రాష్ట్రానికి రావాల్సిన పెట్టబడులపై బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.? ప్రచార ఖర్చు తగ్గించుకుని, తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకుండా.. కేవలం సరైన సమాచారం ఇచ్చేలా మాత్రమే వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అభినందనీయం. ముమ్మాటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటన సక్సెస్ అయి తీరుతుంది. కానీ, వైసీపీ మీదా, వైసీపీ ప్రభుత్వం మీదా దావోస్ పర్యటన నేపత్యంలో టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారమైతే కొనసాగుతూనే వుంటుంది.
ఆవిరి ఇడ్లీ : తక్కువ కేలరీలు, ఎక్కువ ఆరోగ్యం Idli vs Dosa : దక్షిణాది భారతీయుల ఇళ్లలో ఉదయం…
Donald Trump : అమెరికా United States of America అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన ఆర్థిక విధానాలకు ఆ…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కారణం ఆయన కొత్త సినిమా కాదు…
Raghurama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో ప్రకంపనలు సృష్టించే ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'నెయ్యి' రాజకీయం ముదిరి పాకాన పడింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం…
PhonePe : డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందంజలో ఉన్న PhonePe మరో వినూత్న ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ను…
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా…
KCR Big decision : తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో వేడెక్కుతుంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, నిన్నటి మున్సిపల్…
Naa Anveshana : సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మన 'నా అన్వేషణ' అన్వేష్కు మెటా కంపెనీ గట్టి…
Aadhaar Card : నేటి డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో కీలక పత్రంగా మారింది. పిల్లల…
Success Story of Bihar Farmer వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు నేటి తరం రైతులు. సంప్రదాయ…
Revanth Reddy : తెలంగాణలో Telangana రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం Congress government మరో సంచలన నిర్ణయానికి…
This website uses cookies.