
ap cm ys jagan sacrifice for ap minister
YS Jagan : అమరావతి అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరం అవుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చేసిన పబ్లిసిటీ స్టంట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏమయ్యింది అమరావతి.? ఆ అమరావతి ఇప్పుడెలా వుంది.? అని ఆలోచిస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారణంగా అమరావతి ప్రాజెక్టు ఆగిపోయిందనే టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారమే కనిపిస్తుంది తప్ప, చంద్రబాబు హయాంలో కేవలం పబ్లిసిటీ తప్ప, పని జరగలేదన్న వాస్తవం బయటకు రాదు. వివిధ దేశాల్లో రాజధాని అమరావతి ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు బృందం విహార యాత్రలు చేసింది. బోల్డంత ప్రజా ధనాన్ని వృధా చేసింది.
ఆనాటి ఆ వృధా ఖర్చు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. అమరావతిలో అణు ఇంధన కర్మాగారం.. అని పాకిస్తాన్ మీడియా చెప్పుకునే స్థాయికి అమరావతిలో కొన్ని డిజైన్లను అప్పట్లో చంద్రబాబు గీయించడం చూశాం. దావోస్ పర్యటనలన్నారు, ఇంకేవేవో చెప్పారు. లక్షల కోట్ల పెట్టుబడులు, వాటికి ఒప్పందాలనీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. కానీ, వచ్చిన పెట్టుబడులెంత.? వాటి వల్ల రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎంత.? అంటే ఇప్పుడు టీడీపీ పెదవి విప్పలేదు, విప్పదు కూడా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళుతున్నారన్న విషయం ఖరారయ్యాక, టీడీపీ అలాగే టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం తీవ్రస్థాయిలో మొదలు పెట్టింది.
YS Jagan Davos Tour, TDP Mark Negativity
కోర్టు నుంచి అనుమతి తీసుకుంటే తప్ప, విదేశాలకు వెళ్ళలేని ముఖ్యమంత్రి.. అని కూడా ఎగతాళి చేశారు. ఈ తరహా విమర్శల్ని వైఎస్ జగన్ ఓపికగా భరించారు. రాష్ట్రం కోసం తాను చెయ్యాల్సినదల్లా చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఆర్భాటంలా కాకుండా, హుందగా దావోస్ బయల్దేరారు. అక్కడ రాష్ట్రానికి రావాల్సిన పెట్టబడులపై బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.? ప్రచార ఖర్చు తగ్గించుకుని, తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకుండా.. కేవలం సరైన సమాచారం ఇచ్చేలా మాత్రమే వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అభినందనీయం. ముమ్మాటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటన సక్సెస్ అయి తీరుతుంది. కానీ, వైసీపీ మీదా, వైసీపీ ప్రభుత్వం మీదా దావోస్ పర్యటన నేపత్యంలో టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారమైతే కొనసాగుతూనే వుంటుంది.
School Holidays : తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చింది.…
CM Revanth Reddy Uppal : హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ముఖ్యంగా నగర…
Miyapur : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం మియాపూర్లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
Gachibowli : హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకున్న యువతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కో-లివింగ్ హాస్టల్లో నివసిస్తున్న…
Hanuman Nagar Colony Association : ఉప్పల్ జూన్ 7 : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ…
Farmers : వ్యవసాయం అంటే చాలా మందికి ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలే గుర్తుకు…
LPG Gas Cylinder : దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో,…
Bigg Boss Telugu 10 : తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్ తెలుగు’…
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
This website uses cookies.