CM Jagan : విశాఖపట్నం వేదికగా ఇవాళ రేపు గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం జరగనుంది. ఈరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని అద్భుత రేతిలో ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇచ్చిన స్పీచ్ లో మూడు రాజధానులపై క్లారిటీ ఇవ్వటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వ్యాపారవేత్తలు మరియు వేలాది మంది అతిథుల మధ్య విశాఖపట్నం గొప్పదనం గురించి చెబుతూ రాష్ట్రానికీ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నగరంగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో కూడా ఢిల్లీ వేదికగా సీఎం జగన్ ఈ కామెంట్లు చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. జనవరి 31 వ తారీకు ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని అందర్నీ ఆహ్వానిస్తూ విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటుందని త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్ కాబోతున్నట్లు తెలిపారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇక ఇదే సమయంలో ఉత్తరాంధ్రాకి చెందిన వైసీపీ కీలక నాయకుల సైతం విశాఖ రాజధానిగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఉగాది పండుగ నుండి విశాఖపట్నం వేదికగా పరిపాలన సాగుతుందని మరి కొంతమంది వ్యాఖ్యానించడం జరిగింది.
కొత్త విద్యా సంవత్సరం నాటికి విశాఖ పూర్తి పరిపాలన రాజధానిగా కార్యకలాపాలు మొదలవుతాయని తెలియజేశారు. అయితే మూడు రాజధానులు అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అమరావతి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మార్చి 28వ తారీఖు నాడు విచారణకు రావాల్సి ఉంది. అయితే ముందుగానే విచారణకు తీసుకోవాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును కోరింది. ఈ క్రమంలో మూడు రాజధానుల మేటర్ కోర్టు పరిధిలో ఉండగా మరోసారి విశాఖ వేదికగా.. అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో వైఎస్ జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కామెంట్లు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.