
cm ys jagan to inspect polavaram project
CM Jagan : విశాఖపట్నం వేదికగా ఇవాళ రేపు గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం జరగనుంది. ఈరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని అద్భుత రేతిలో ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇచ్చిన స్పీచ్ లో మూడు రాజధానులపై క్లారిటీ ఇవ్వటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వ్యాపారవేత్తలు మరియు వేలాది మంది అతిథుల మధ్య విశాఖపట్నం గొప్పదనం గురించి చెబుతూ రాష్ట్రానికీ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నగరంగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
cm jagans comments on three capitals
గతంలో కూడా ఢిల్లీ వేదికగా సీఎం జగన్ ఈ కామెంట్లు చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. జనవరి 31 వ తారీకు ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని అందర్నీ ఆహ్వానిస్తూ విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటుందని త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్ కాబోతున్నట్లు తెలిపారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇక ఇదే సమయంలో ఉత్తరాంధ్రాకి చెందిన వైసీపీ కీలక నాయకుల సైతం విశాఖ రాజధానిగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఉగాది పండుగ నుండి విశాఖపట్నం వేదికగా పరిపాలన సాగుతుందని మరి కొంతమంది వ్యాఖ్యానించడం జరిగింది.
కొత్త విద్యా సంవత్సరం నాటికి విశాఖ పూర్తి పరిపాలన రాజధానిగా కార్యకలాపాలు మొదలవుతాయని తెలియజేశారు. అయితే మూడు రాజధానులు అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అమరావతి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మార్చి 28వ తారీఖు నాడు విచారణకు రావాల్సి ఉంది. అయితే ముందుగానే విచారణకు తీసుకోవాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును కోరింది. ఈ క్రమంలో మూడు రాజధానుల మేటర్ కోర్టు పరిధిలో ఉండగా మరోసారి విశాఖ వేదికగా.. అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో వైఎస్ జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కామెంట్లు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందులు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.…
Jayashankar : ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ తన వ్యూహచతురతతో తన నౌకలను సురక్షితంగా ఒడ్డుకు…
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది అదేమిటంటే నారా లోకేష్…
YS Jagan : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.…
Gold and Silver Rate 15 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి ప్రియులకు,…
Curd for Health : పెరుగు అనేది అన్ని కాలాల్లో తినదగిన పోషకాహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది శరీరానికి…
Sugarcane Juice : వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మండే ఎండలతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని…
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
Blower Electric Chulha : ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. మొదట చూసినవారికి…
Railway Jobs : దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశం వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం…
This website uses cookies.