cm ys jagan to inspect polavaram project
CM Jagan : విశాఖపట్నం వేదికగా ఇవాళ రేపు గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం జరగనుంది. ఈరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని అద్భుత రేతిలో ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇచ్చిన స్పీచ్ లో మూడు రాజధానులపై క్లారిటీ ఇవ్వటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వ్యాపారవేత్తలు మరియు వేలాది మంది అతిథుల మధ్య విశాఖపట్నం గొప్పదనం గురించి చెబుతూ రాష్ట్రానికీ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నగరంగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
cm jagans comments on three capitals
గతంలో కూడా ఢిల్లీ వేదికగా సీఎం జగన్ ఈ కామెంట్లు చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. జనవరి 31 వ తారీకు ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని అందర్నీ ఆహ్వానిస్తూ విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటుందని త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్ కాబోతున్నట్లు తెలిపారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇక ఇదే సమయంలో ఉత్తరాంధ్రాకి చెందిన వైసీపీ కీలక నాయకుల సైతం విశాఖ రాజధానిగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఉగాది పండుగ నుండి విశాఖపట్నం వేదికగా పరిపాలన సాగుతుందని మరి కొంతమంది వ్యాఖ్యానించడం జరిగింది.
కొత్త విద్యా సంవత్సరం నాటికి విశాఖ పూర్తి పరిపాలన రాజధానిగా కార్యకలాపాలు మొదలవుతాయని తెలియజేశారు. అయితే మూడు రాజధానులు అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అమరావతి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మార్చి 28వ తారీఖు నాడు విచారణకు రావాల్సి ఉంది. అయితే ముందుగానే విచారణకు తీసుకోవాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును కోరింది. ఈ క్రమంలో మూడు రాజధానుల మేటర్ కోర్టు పరిధిలో ఉండగా మరోసారి విశాఖ వేదికగా.. అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో వైఎస్ జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కామెంట్లు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Shower Peeing : చాలామందికి ఇలాంటి అలవాటు ఉంటుంది. స్నానం చేసే సమయంలో మూత్ర విసర్జన చేస్తుంటారు.ఇలాంటీ అలవాటుని పవర్…
73 Years Old Woman : 73 ఏళ్ల మహిళ కడుపులో 30 ఏళ్లుగా ఉన్న కల్సిఫైడ్ ఫీటస్ను(రాతి బిడ్డ)…
Eat Soaked Dates : ఆధార్నంగా పరగడుపున కొన్ని పదార్థాలు తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి. పదార్థాలలో ఒకటైనది డైట్.…
Toli Ekadashi 2025 : ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి వస్తుంది. ఈ ఏడాది కూడా తొలి ఏకాదశి…
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
This website uses cookies.