cm ys jagan decision on ap volunteers
YS Jagan : దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించినా అవి అసలైన లబ్ధిదారులకు అందడం లేదని గ్రహించి… వాటిని లబ్ధిదారులకు అందేలా చేసేందుకు ఒక ప్రతినిధి కావాలని.. ఆ ప్రతినిధి కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన వారైతే… లబ్ధిదారులకు ఖచ్చితంగా సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని గ్రహించిన సీఎం జగన్… ఏపీలో తను అధికారంలోకి రాగానే… ముందు వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులను నియమించారు. వాళ్ల ద్వారానే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
cm ys jagan decision on ap volunteers
అయితే… వాలంటీర్లు పనితీరుపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. కావాలని రాజకీయంగా వాలంటీర్లను ప్రభుత్వం వాడుకుంటోంది అనే ఆరోపణలు మొదటినుంచి ఉన్నాయి. వాలంటీర్లను అడ్డం పెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అధికార వైఎస్సార్సీపీ పార్టీని ఇరుకున పెట్టాలని తెగ ప్రయత్నిస్తున్నారు. నిజానికి వాలంటీర్ల వల్ల అధికార పార్టీ నేతలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. వాళ్ల పనితీరుపై అధికార పార్టీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
కొందరు వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే అపవాదు కూడా ఈమధ్య వస్తోంది. ఈ విషయం సీఎం జగన్ వరకూ వెళ్లిందట. మొన్న జరిగిన తిరుపతి ఉపఎన్నికల్లోనూ కొందరు వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారన్న విమర్శ ఉంది. దీనిపై సీఎం జగన్ కూడా సీరియస్ అవడంతో పాటు… ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్ల పనుల పర్యవేక్షణ కోసం ఉన్నతాధికారులను నియమించే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారట. దాని కోసం ఒక కమిటీని వేసి… ఆ కమిటీ వాలంటీర్ల పనులను పర్యవేక్షిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో తహసీల్దార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు అవుతుంది. వాళ్ల పనితీరును తహసీల్దార్లు ఎప్పటికప్పుడు గమనిస్తూ… ప్రభుత్వానికి నివేదిక పంపిస్తుంటారు. ఎవరైతే వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారో.. సమర్థంగా పనిచేయరో వాళ్లను వెంటనే విధుల నుంచి తప్పించేలా సీఎం జగన్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారట. ఏపీలోని ప్రతి మారుమూల పల్లెకు కూడా నేడు వాలంటీర్లు ఉన్నారు. కానీ.. ప్రభుత్వం ప్రారంభించే సంక్షేమ పథకాలు మాత్రం మారుమూల పల్లెకు చేరడం లేదనేది వాస్తవం. ఆ విషయంపై సీఎం జగన్ బాగానే సీరియస్ అయి… వాలంటీర్ల మీద శ్రద్ధ పెడుతున్నారు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.