7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. డీఏ, డీఆర్ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. తాజాగా ఏడో వేతన సంఘం సిఫారసు ప్రకారం.. డీఏ, డీఆర్ రేట్ ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. పలు రాష్ట్రాలు తమ ప్రభుత్వ ఉద్యోగుల కోసం డీఏను పెంచాయి. ఏఐసీపీఐ ఐడబ్ల్యూ డేటా ప్రకారం లేబర్ బ్యూరో రిలీజ్ చేసిన డేటా ప్రకారం సిమ్లాలో డీఏను ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అలాగే.. కేంద్రం నుంచి కూడా డీఏ పెంపుపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అంతకంటే ముందు.. ఏ రాష్ట్రాల్లో ఆగస్టులో డీఏను పెంచారో తెలుసుకుందాం.
ఆగస్టు 16, 2022 న ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం డీఏను 6 శాతం నుంచి 28 శాతానికి పెంచింది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం డీఏను పెంచింది. ఆరో వేతన సంఘం కమిషన్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం డీఏను 15 శాతానికి పెంచింది. ఆగస్టు 1, 2022 నుంచి రాష్ట్ర ప్రభుత్వం డీఏ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. డీఏ, డీఆర్ పెంపును గుజరాత్ ప్రభుత్వం 3 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకే గుజరాత్ ప్రభుత్వం కూడా డీఏను పెంచింది.
15 ఆగస్టు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ డీఏ పెంపుపై ప్రకటన వెలువరించారు. డీఏ పెంపు వల్ల 9.38 లక్షల గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయత్ సర్వీస్, పెన్షనర్లకు డీఏ పెరగనుంది. జనవరి 1, 2022 నుంచి గుజరాత్ ఉద్యోగులకు డీఏ పెంపు వర్తించనుంది. మహారాష్ట్ర కూడా డీఏను 3 శాతం పెంచింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 34 శాతానికి పెంచారు. అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏతో సమానం. తమిళనాడులోనూ ఆ ప్రభుత్వం 34 శాతానికి డీఏను పెంచింది. ఇటీవల డీఏ, డీఆర్ ను 3 శాతం పెంచింది. 1, జులై 2022 నుంచి తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు వర్తించనుంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.