Categories: NationalNews

Corona Second Wave : కరోనా వచ్చిందా? బెడ్లు ఖాళీ లేవు? ఎవరైనా పోతే ఇస్తామంటున్న ఆసుపత్రులు?

Advertisement
Advertisement

Corona Second Wave : కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. చాప కింద నీరులా కరోనా విస్తరిస్తోంది. అసలు.. ఏం జరుగుతోందో కూడా అర్థం కావడం లేదు. అటు చూసి ఇటు చూసే లోపల జరగరాని ఘోరం జరుగుతోంది. రోజు రోజుకూ కేసులు రెట్టింపు అవుతున్నాయి. అసలు ప్రజలకు అయితే ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎక్కడ చూసిన కరోనానే. ఆసుపత్రుల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. కరోనాతో చనిపోయిన రోగుల మృతదేహాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఆసుపత్రుల్లో ఓమూలకు కుప్పలుకుప్పలుగా శవాలను పడేస్తున్నారు. అసలు.. కరోనా ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటే ప్రభుత్వాలు ఎందుకు నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు అర్థం కావడం లేదు.

Advertisement

dangerous corona second wave in india

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. రోజుకూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. పెద్ద పెద్ద నగరాల్లో అయితే రోజూ వందల మంది కరోనాతో ప్రాణాలు విడుస్తున్నారు. కొందరికి వెంటిలేటర్లు దొరక్క…. మరికొందరికి ఆక్సీజన్ అందక… ఇంకొందరికి బెడ్లు దొరక్క… మృత్యువాత పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఏ ఆసుపత్రి చూసినా నిండిపోయింది. ఎక్కడా బెడ్లు ఖాళీ లేవు. బెడ్లు ఖాళీ లేక ఆసుపత్రుల్లో చేర్చుకోకపోవడంతో… ఆసుపత్రుల బయటే చాలామంది రోగులు తమ ప్రాణాలను విడుస్తున్నారు. ఆసుపత్రుల్లో బెడ్ ఇవ్వాలని అడిగితే… ఎవరైనా పోతే ఇస్తామంటూ ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. పోవడమంటే ఎవరైనా కరోనా రోగి చనిపోవడమో లేక డిశ్చార్జ్ అవ్వడమో.. ఈ రెండింట్లో ఏదో ఒకటి అయితే కానీ.. బెడ్లు ఖాళీ కావని సిబ్బంది చెబుతున్నారు. ఎంత స్పీడ్ గా కరోనా వ్యాప్తి చెందుతోంది అంటే ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రుల్లో చేరినా… వాళ్లు రికవరీ అవుతున్నారన్న నమ్మకం కూడా లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండలేక… ప్రైవేటు ఆసుపత్రల్లో లక్షలు ఖర్చు పెట్టలేక జనాలు అల్లాడిపోతున్నారు.

Advertisement

Corona Second Wave : వెంటిలేటర్లు, ఆక్సీజన్ల కొరతతో పెరుగుతున్న మరణాల రేటు

చాలామంది కరోనా పేషెంట్లు వెంటిలేటర్లు లేక చనిపోతున్నారు. ఆక్సీజన్ అందక, వెంటిలేటర్లు లేక ఊపిరి ఆడక ఎక్కువ మంది చనిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. 100 పడకలు ఉన్న ఆసుపత్రుల్లో కేవలం 10 వెంటిలేటర్లు మాత్రమే ఉంటే… మిగితా వాళ్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కరోనాతో ఆసుపత్రుల్లో చేరాక.. డిశ్చార్జ్ అయ్యేవాళ్ల కంటే… చనిపోయేవారు, పరిస్థితి విషమించే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా శరీరంలో చేరాక.. అది అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని… దీంతో ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోందని వైద్యులు చెబుతున్నారు.

ఇక… సర్కారు ఆసుపత్రుల్లో అన్నింటికీ కొరతే. వెంటిలేటర్లు, బెడ్స్, ఆక్సీజన్… వీటన్నింటికీ కొరత ఉండటం వల్ల… ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి… ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనాకు సంబంధించిన చికిత్స కోసం ఆక్సీజన్, వెంటిలేటర్లు, బెడ్స్ కొరత లేకుండా చూసి ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

2 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

60 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

This website uses cookies.