GHMC : జీహెచ్ఎంసీ మేయర్ ఎవరి మాటా వినడం లేదా? టీఆర్ఎస్ నేతల మాట అస్సలు వినడం లేదా?

Advertisement
Published by
Advertisement

జీహెచ్ఎంసీలో మరోసారి ఎలాగోలా అధికారం దక్కించుకున్న అధికార టీఆర్ఎస్.. ఈసారి మేయర్ పదవిని పార్టీ సీనియర్ నేత, ఎంపీ కే.కేశవరావు కూతురు బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మీకి కట్టబెట్టింది. విజయలక్ష్మీతో పాటు మరికొందరు మహిళా కార్పొరేటర్ల పేర్లు మేయర్ రేసులో వినిపించినా.. సీఎం కేసీఆర్ మాత్రం ఈసారి విజయలక్ష్మికి అవకాశం కల్పించారు. సీనియర్ నేత కే.కేశవరావు రాజకీయ వారసురాలు, ఉన్నత విద్యార్హత కలిగిన విజయలక్ష్మి.. జీహెచ్ఎంసీ మేయర్‌గా తనదైన మార్కు చూపిస్తారని చాలామంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అయితే అసలు విజయలక్ష్మి వ్యవహారశైలి కూడా టీఆర్ఎస్ అధిష్టానానికి మింగుడుపడటం లేదని తెలుస్తోంది.

Advertisement

different way Ghmc Mayor Gadwal Vijayalakshmi

ఓ సీనియర్ ఐపీఎస్ అధికారితో విజయలక్ష్మి మాట్లాడిన తీరు ఆయనను కలిచివేసిందట. దీంతో ఈ విషయాన్ని ఆయన మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.కార్పొరేటర్లకే కాదు కనీసం ఎమ్మెల్యేలకు, ఎంపీలకూ విషయం చెప్పకుండానే ఆకస్మిక పర్యటనలు, అప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తోందని ఆమెపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారట. ప్రొటోకాల్ ప్రకారం మేయర్ కార్పొరేషన్‌లోని నియోజకవర్గాల్లో పర్యటించేటప్పుడు స్దానిక ఎమ్మెల్యే, కార్పోరేటర్లకు సమాచారం ఉండాలి. కానీ మేయర్ విజయలక్ష్మి షెడ్యూల్‌కు సంబంధించి కార్పొరేటర్లకు విషయం తెలియకుండా కార్యక్రమాలు ముగించేస్తున్నారట. దీంతో కార్పొరేటర్లు మేయర్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. కార్పొరేటర్లే కాదు స్థానిక శాసనసభ్యులు కూడా మేయర్‌ విజయలక్ష్మి తీరుపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

Advertisement

అధికారులతోనూ.. GHMC

జీహెచ్‌ఎంసీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు తాను వచ్చేవరకు చేయొద్దంటూ విజయలక్ష్మి హుకుం జారీచేశారట. దీంతో ఎమ్మెల్యేలు సైతం గుర్రుగా ఉంటున్నారట. మేయర్‌కు, బల్దియా అధికారులకు మధ్య సమన్వయం కొరవడిందని జీహెచ్ఎంసీ సిబ్బంది అనుకుంటున్నారట. ఇటీవల కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో మేయర్‌కు తెలియకుండా కొన్ని ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేసిన ఇంజినీర్లపై సీరియస్ అయ్యారట. సంబంధిత అధికారులకు మోమోలు కూడా జారీ చేశారు.

TRS Party

ఇక కమిషనర్ లోకేష్ కుమార్ సైతం మేయర్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారట.ఎల్బీనగర్ జోన్ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాల్లో విజయలక్ష్మీ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా కొవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ఆరోగ్య పరిరక్షణ కోసం పీపీఈ కిట్లను పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ ఏ ఒక్క కార్యక్రమానికి కూడా కమిషనర్ హాజరుకాలేదు. ఇలా మేయర్ కార్యక్రమాలకు సంబంధించి కమిషనర్‌కు సమాచారం లేకపోవడం, కమిషనర్ సైతం దూరంగా ఉండటం చూస్తుంటే ప్రథమ మహిళ ఎవరిని కలుపుకొని వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. మేయర్ పర్యటన అంటేనే అయోమం గందరగోళం అని అధికారులు చెప్పుకుంటున్నారంట.

కేకే దృష్టి.. GHMC

నగరానికి చెందిన ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా విజయలక్ష్మి తన సన్నిహితుల విషయంలో తీసుకున్న ఓ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఈ విషయాన్ని ఆయన మంత్రి కేటీఆర్‌కు వివరించారని తెలుస్తోంది. విజయలక్ష్మి తీరుపై అటు అధికారులు, ఇటు టీఆర్ఎస్ నేతల నుంచి ఫిర్యాదులు రావడంపై స్పందించిన మంత్రి కేటీఆర్.. దీనిపై పార్టీ సెక్రటరీ జనరల్, విజయలక్ష్మి తండ్రి కే. కేశవరావుతో చర్చించారని తెలుస్తోంది. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని.. విజయలక్ష్మి వ్యవహారశైలి మారేలా చూడాలని ఆయన కేకేను కోరారని సమాచారం.

అయితే దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టిన టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు.. జీహెచ్ఎంసీ అంశాలపై తాను స్వయంగా దృష్టి పెట్టారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో మేయర్ తీసుకునే నిర్ణయాలను కేశవరావు ముందుగానే సమీక్షిస్తున్నారని.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మొదలైంది. కేకే స్వయంగా రంగంలోకి దిగి నిర్ణయాలు తీసుకుంటుండటంతో.. టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఈ విషయంలో కూల్ అయినట్టు సమాచారం.

Advertisement

Recent Posts

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జనసేన తో IPAC ? 2029 బిగ్ టార్గెట్

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…

32 minutes ago

Ananya Nagalla : “లీసా” నా కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది  హీరోయిన్ అనన్య నాగళ్ల..!

Ananya Nagalla  : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…

3 hours ago

High Court : నిరుద్యోగులకు శుభవార్త .. హైకోర్టులో 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..!

High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…

3 hours ago

Students : విద్యార్థులకు శుభవార్త .. ఇక పై అవన్నీ ఫ్రీ .. ప్రభుత్వం కీలక నిర్ణయం ..!

Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…

5 hours ago

YSR : ఈ టైం లో వైఎస్సార్ CM గా ఉండి ఉంటే … ఏపీ ఎలా ఉండేది..?

YSR :  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…

6 hours ago

Summer Drinks : ఈ నేచురల్ డ్రింక్స్ తాగండి.. ఎండల వేడి నుంచి మిమ్మల్ని కాపాడుకోండి ..!

Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…

8 hours ago

Ajwain Water : జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ .. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల అద్భుత లాభాలు ..!

Ajwain Water :  మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…

9 hours ago

Curry Leaves : కరివేపాకు ఆరోగ్యానికి మేలు .. కానీ వీరికి మాత్రం విషంతో సమానం ..!

Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…

11 hours ago

Supreme Court : అర్ధరాత్రి ఏపీ లో దొంగ ఓట్లు ? సుప్రీం కోర్టు లో సంచలన పరిణామం..!

Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…

20 hours ago

Dhurandar-2 : భారీ విజయంతో బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ధురంధర్ 2 .. 3000 కోట్ల క్లబ్‌లో అరుదైన ఘనత ..!

Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…

21 hours ago

Ys Jagan Modi : మోడీ కోరిన కోరిక కి జగన్ స్పాట్ లో గ్రీన్ సిగ్నల్.. కూటమి కి షాక్

Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…

23 hours ago

El Nino Summer : ఎల్ నినో సమ్మర్ అంటే తెలుసా ? తెలుగు రాష్ట్రాలకి పెను ముప్పు

El Nino Summer  : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…

1 day ago