Categories: ExclusiveNews

Doctor : ఫోన్‌లో డాక్ట‌ర్‌.. ఆప‌రేష‌న్ చేసిన‌ నర్సు.. చివ‌రి ఏం జ‌రిగిందంటే..?

Advertisement
Advertisement

Doctor : ఈ రోజుల్లో కొంద‌రు వైద్యుల‌కి మ‌నుషుల ప్రాణాలంటే లెక్కేలేదు. చాలా అశ్ర‌ద్ధ‌తో ఆప‌రేష‌న్స్ చేస్తూ మ‌నుషుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా వరంగల్‌ జిల్లా వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి ఫోన్‌ ద్వారా డాక్టర్‌ సలహా తీసుకుంటూ ఇద్దరు నర్సులు డెలివరి చేయ‌డంతో పుట్టిన మగశిశువు ఒక రోజు తర్వాత చనిపోయింది. డాక్టర్‌ నర్సుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయిందంటూ పోలీసులకు బిడ్డ తండ్రి ఇచ్చిన పిర్యాదు చేయడంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

Advertisement

Doctor ప్రాణాల‌తో చెల‌గాటం..

మ‌హబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామానికి చెందిన కసిరెడ్డి నరేశ్‌ భార్య బేబీ శ్రీజ పురిటి నొప్పులతో ఈ నెల 16న వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో చేరింది. 17న నొప్పులు రావడంతో డెలీవరీ చేయాలని నరేశ్‌ కుటుంబసభ్యులు డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ని కోరారు. అయితే డాక్టర్‌ శ్రీజను చూడకుండానే, గర్భిని అని కనికరం లేకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే నొప్పులు బాగా రావ‌డంతో అక్క‌డ ఉన్న స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎమ్‌లు శ్రీజ పరిస్థితిని డాక్టర్‌ కు ఫోన్‌ లో వివరించారు. దీంతో వైద్యురాలు. స్టాఫ్‌ నర్స్‌ కి ఏఎన్‌ఎంకి తాను ఫోన్‌ లో చెబుతున్న తీరు చేయండి అని వారికి సూచన చేయడంతో ఇద్దరు నర్సులు శ్రీజను లేబర్‌ రూమ్‌ కి తీసుకెళ్లారు.

Advertisement

Doctor : ఫోన్‌లో డాక్ట‌ర్‌.. ఆప‌రేష‌న్ చేసిన‌ నర్సు.. చివ‌రి ఏం జ‌రిగిందంటే..?

అయితే డాక్ట‌ర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ఆమె ఇచ్చిన సూచ‌న‌ల ప్ర‌కారం నర్సులు డెలివ‌రీ చేశారు. వారికి మ‌గ‌బిడ్డ జ‌న్మించారు. అయితే త‌ల్లికి బిడ్డను చూపించ‌కుండా వెంట‌నే వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ ఆ శిశువు చికిత్స పొందుతూ చనిపోయింది. తమ బిడ్డ చనిపోవడానికి డ్యూటీ డాక్టర్‌, స్టాఫ్‌ నర్సు, ఏఎన్‌ఎమ్‌ల నిర్లక్ష్యమే కారణమంటూ శ్రీజ భర్త నరేశ్‌ వర్థన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీజ భర్త నరేశ్‌ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కూడా డాక్టర్‌ ఫోన్‌ లో చేస్తున్న సూచనలతో డెలివరి చేసినట్లు స్టాఫ్‌ నర్స్‌ ఏఎన్‌ఎమ్‌ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన వారిని క‌ఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు.

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.