YCP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హంగామా కనిపిస్తోంది. జనంలోకి వైసీపీ ప్రజా ప్రతినిథులు వెళ్ళడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరింత అగ్రెసివ్గా వ్యవహరిస్తుండడంతో, విపక్షాల్లో ఆందోళన బయల్దేరింది. కూటములు కట్టేందుకు విపక్షాలు నానా తంటాలూ పడుతున్నాయి. ఎవరు ఎవరితో కలవాలన్నదానిపై విపక్షాలు కిందా మీదా పడుతున్నాయి. ఆ పరిస్థితిని తీసుకొచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావడం గమనార్హం. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తన పని తాను చేసుకుపోతున్నారు.
అదే సమయంలో, పార్టీ అధినేతగా పార్టీలోని కీలక నేతలకు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. 175 సీట్లలోనూ గెలిచేలా పార్టీని బలోపేతం చేయాలని ఆదేశిస్తున్నారు. అందుకు తగ్గ కార్యాచరణని ఇప్పటికే ప్రకటించేశారు కూడా. దాంతో, వైసీపీ నేతలు జనంలో, జనంతో బిజీగా వుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల ప్రజల నుంచి వైసీపీ నేతలు కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మాట కూడా వాస్తవం. అయితే, ఎక్కడ తమకు వ్యతిరేకత వుందన్న విషయం తెలుసుకోవడానికి ఈ ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్యక్రమం వైసీపీకి ఎంతగానో ఉపయోగపడనుంది. వైసీపీ చేపట్టిన ఈ ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ అట్టర్ ఫ్లాప్ అని విపక్షాలు జబ్బలు చరుచుకుంటున్నా,
ఆ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యమేంటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఇంతకీ, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయా.? రావా.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు వచ్చేందుకు అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే, విపక్షాలు ఎన్నికలకు సిద్ధంగా లేవు గనుక, ఈ సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళితే అది అధికార వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ వ్యూహంతోనే వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకుంటే, విపక్షాలు ముచ్చట పడుతున్నట్లు ముందస్తు ఎన్నికలూ వస్తాయ్.. అధికార వైసీపీ, ఇంకోసారి అంతకు మించిన (2019కి మించిన) విజయాన్ని అందుకోవడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది.
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. పుష్ప…
Vasireddy Padma : వైసీపీ అధినేత జగన్కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీకి చెందిన నాయకులు.ఎంపీలు, ఎమ్మెల్సీలు,…
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 500 అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు NICL అధికారిక వెబ్సైట్…
Vangaveeti Radha Krishna : తెలుగుదేశం పార్టీ నాయకుడు, విజయవాడ మాస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అలియాస్…
Vishnu Priya : బిగ్ బాస్ షోలో అనేక ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. గత ఆదివారం నాగ మణికంఠ ఎలిమినేట్…
Hand Rubbing : మనలో చాలామంది అప్పుడప్పుడు రెండు చేతులను రుద్దుతూ ఉంటారు. అయితే ఈ రెండు అరచేతులను రుద్దటం…
Curd : మన భోజనంలో ప్రతిరోజు పెరుగు ఉండి తీరాల్సిందే. మనకు ఖచ్చితంగా భోజనం చివరిలో ఒక ముద్ద పెరుగన్నం…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ సిహెచ్. అయ్యన్న పాత్రుడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్. త్వరలో…
This website uses cookies.