Home » Exclusive » Epfo Brings New System In Pension Scheme
Exclusive

Epfo : పెన్షనర్లకు శుభవార్త ఇకపై నెల చివర్లోనే అకౌంట్లోకి డబ్బులు..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 17, 2022, 7:30 pm
Advertisement

Epfo : పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ త్వరలోనే శుభవార్త చెప్పనుంది. పెన్షనర్ల ఇబ్బందులను గుర్తించిన ఈపీఎఫ్ఓ.. తాజాగా ఓ కొత్త విధానంను అమల్లోకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ సెక్టార్ లాగే ఇకపై ఈపీఎఫ్ఓ పెన్షనర్లు కూడా ప్రతి నెలా చివరి రోజున పెన్షన్ పొందేలా నిర్ణయం తీసుకోనుందట. ఈ మేరకు పింఛనుదారులు తమ పెన్షన్ కోసం ఇకపై ప్రతినెలా 1 లేదా 5వ తారీఖు వరకు వేచిచూడాల్సినవసరం ఉండబోదట. తాజా విధానంతో ఇకపై ప్రతీ నెల చివరన లేదా కొత్త నెల మొదలుకు 2 రోజుల ముందుగానే పెన్షనర్ల బ్యాంకు అకౌంట్లోకి నగదు జమ అయ్యేలా పీఎఫ్ కమిసనర్ విశాల్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తక్షణమే పెన్షన్ ను పంపిణీ చేసే బ్యాంకులకు విధి విధానాలను జారీ చేయాలని రీజనల్ పీఎఫ్ ఆఫీసులకు ఆయన సూచించారు. ఈ ప్రకటనతో లక్షలాది మంది పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పీఎఫ్ కమిసనర్ విశాల్ అగర్వాల్ ఈ తాజా విధానాన్ని ఈ నెల నుంచే అమల్లోకి తెచ్చేలా ప్రొవిజన్లు తీసుకొచ్చినట్టు తెలిపారు. పెన్షన్‌ను ఆలస్యంగా పొందడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలపై.. పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నారు. వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈపీఎఫ్ ఓ… ప్రతి నెలా ముగింపునకు 2 రోజుల ముందుగానే బ్యాంకులకు రికన్సిలేషన్ స్టేట్‌మెంట్‌ను పంపేలా అన్ని ఏర్పాటు చేసుకోవాలని రీజనల్ కార్యాలయాలకు పీ ఎఫ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

Epfo brings new system in pension scheme

Advertisement

Epfo : ఇకపై నెల చివరలోనే పెన్షన్..!

దీంతో పెన్షన్ అమౌంట్ బ్యాంకులకు చేరుకుని తద్వారా నెల ముగింపునకు రెండు రోజుల ముందే అనగా 30 వ తారీకు లేదా 31వ తేదీ నాడే పెన్షనర్ల డబ్బులు వారి ఖాతాల్లో జమ కానున్నాయి.అయితే పాక్షికంగా అమలు లోకి తెస్తున్న ఈ విధానం… రెండు నెలల ఫలితాలు చూశాక, పూర్తిగా 100 శాతం దీన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్ ఎట్టకేలకు నెరవేరుతుండటంతో లక్షలాది మంది పెన్షనర్లు ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి