ex minister paleti ramarao not leaving ysrcp
YSRCP : ఏపీలో అధికార పార్టీ నాయకులు కొందరు అసంతృప్తితో ఉన్నారని.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుతో విసిగి పోయిన వారు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల్లోనే చాలా వ్యతిరేకత వచ్చిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు వైకాపాలో 2019 ఎన్నికల తర్వాత జాయిన్ అయ్యాడు. పార్టీలో ప్రాముఖ్యత లేదు అంటూ పార్టీ మారేందుకు రామారావు చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ex minister paleti ramarao not leaving ysrcp
పాలేటి రామారావు వైకాపాను వీడబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. ఆ విషయాన్ని స్వయంగా రామారావు మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఏపీలో ప్రజామోధ్యమైన పరిపాలన కొనసాగుతుంది. కనుక తాము పార్టీ వీడి పోవాల్సిన అవసరం ఏంటీ అంటూ ప్రశ్నించాడు. అధికార పార్టీని వదిలి పోయేంత మూర్ఖులం కాదు అన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రామారావు పదవిలో లేకున్నా కూడా సాధ్యం అయినంత వరకు తన కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటూ ఉన్నాడట.
గతంలో చీరాలలో నిరంకుశ పరిపాలన కొనసాగేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యే కరణం బలరాం అన్ని విధాలుగా నియోజక వర్గంను అభివృద్ది చేస్తున్నాడు కనుక పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదు అంటూ ఈ సందర్బంగా మాజీ మంత్రి రామారావు అన్నాడు. ఎమ్మెల్యేతో విభేదాలు అంటూ వస్తున్న వార్తలను కూడా రామారావు కొట్టి పారేశాడు. వైకాపాను బలోపేతం చేసేందుకు అందరం కలిసి కట్టుగా పని చేస్తున్నామని, మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చేస్తామంటూ ఆయన వర్గీయులు కూడా అంటున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.