Ganesh chaturthi procession first start in Mumbai in 1948
Ganesh Chaturthi : దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తులందరూ 10 రోజులు పూజలు చేసి గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. గణపతి బప్పా మోరియా అంటూ, అందంగా అలంకరించిన వాహనాలపై గణపతి విగ్రహాన్ని పెట్టి, ఊరేగిస్తూ గంగమ్మ ఒడికి చేరుస్తారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో గణేషుడికి సంబంధించి ఒక ఫోటో వైరల్ అవుతుంది. గణేష్ చతుర్థి పండుగ ఒక పర్వదినంగా మారటానికి ముందు ఈ వేడుకను ఎలా నిర్వహించారు ఎలా ఊరేగిస్తూ నిమజ్జనం చేశారో ఈ ఫోటోలో కనిపిస్తుంది. ఈ వినాయక చవితిని మహారాష్ట్రలో గుర్తించారు. చత్రపతి శివాజీ మహారాజు కాలం నుండి వినాయక చతుర్థి సాంప్రదాయంగా పూణేలో జరుపుకున్నారు.
గణేశుడు పేష్వాల కులదేవత. వారి పతనంతో పండుగ రాష్ట్ర ప్రోత్సాహాన్ని కోల్పోయింది. ఆ తర్వాత మహారాష్ట్రలో ఒక ప్రైవేట్ కుటుంబ వేడుకగా మారింది. అయితే స్వతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త లోకమాన్య తిలక్ వినాయక చవితి వేడుకలను పునరుద్దించారు. వినాయకుడు పండుగను మండపాలను ఏర్పాటు చేసి జరుపుకునే విధానం 1892లో ప్రవేశపెట్టబడింది. కృష్ణ జిపాంత్ అనే పూణే నివాసి మరాఠీ పాలనలో ఉన్న గ్వాలియర్ ను సందర్శించినప్పుడు అక్కడ అతను సాంప్రదాయ వేడుకను చూసి తన స్నేహితులైన బహుసాహెబ్, లక్ష్మణ్ జావలే బాల సాహెబ్ వారికి చెప్పాడు. జావలే దీనిని అనుసరించి మొదటిసారి వీధిలో మండపాని ఏర్పాటు చేసి గణేశుడి విగ్రహాన్ని స్థాపించారు.
Ganesh chaturthi procession first start in Mumbai in 1948
లోకమాన్య తిలక్ 1893లో తన వార్తాపత్రిక కేసరిలో ఒక వ్యాసంలో జావలే కృషిని ప్రశంసించారు. తర్వాత సంవత్సరం వార్త ఆఫీసులో గణేషుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. వినాయకుడి భారీ విగ్రహాలను మండపాలలో ప్రతిష్టించిన మొదటి వ్యక్తి తిలక్, అనంతరం పూజను నిర్వహించి పదవ రోజున విగ్రహాలను నదులు లేదా సముద్రం వంటి వాటిల్లో నిమజ్జనం చేసే పద్ధతిని స్థాపించారు. గణేష్ చతుర్థి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అన్ని కులాల వర్గాల ప్రజల సమావేశ స్థలంగా మారింది. ఈ ఉత్సవం ఉపన్యాసం కవిత పఠనాలు, నాటకాలు, కచేరీలు, జానపద నృత్యాల రూపాలు సమాజ భాగస్వామ్యాన్ని సులభతరం చేసింది. లోకమాన్య తిలక్ వినాయకుడి విజ్ఞప్తిని దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేశారు. అందరికీ దేవుడిగా గణేష్ చతుర్థిని జాతీయ పండుగగా ప్రాచుర్యం పొందింది.
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
This website uses cookies.