EPFO decision on interest
EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వారలోనే ఖాతాదారులకు శుభవార్త చెప్పనుంది. ప్రతిసారి వడ్డీ జమ ఆలస్యమవుతూ వస్తోంది. కానీ.. ఈ సంవత్సరం ముందుగానే పీఫ్ ఖాతాదారుల అకౌంట్లో వడ్డీ జమ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు దేశంలో ఏడు కోట్లకు పైగా ఎంప్లాయీస్ ఖాతాల్లో వడ్డీ అమౌంట్ జమ కానుంది. అయితే గతంలో వడ్డీ 8.5 శాతం అందించగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశమై వడ్డీ 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వడ్డీని ఖతాదారుల అకౌంట్లలో ఈ సారి ముందుగానే జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే గతంలో కంటే ఈ సారి వడ్డీ శాతాన్ని తగ్గించారు.
2012-13 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం వడ్డీ చెల్లించారు. 2016-17 సంవత్సరంలో 8.65 శాతం, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.55 శాతం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం చొప్పున వడ్డీ జమ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి మాత్రం 8.1 శాతానికి కుదించి వడ్డీ జమ చేయనుంది.కాగా ఈపీఎఫ్ వో ఉద్యోగుల ఖాతాల్లో జూన్ 16 నుంచి డబ్బు జమ చేయడం ప్రారంభించనుంది.
Good news for EPF clients Interest Amount
ప్రతిరోజు 2.5 నుంచి 5 లక్షల మంది ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.72,000 వేల కోట్ల వడ్డీని జమ చేయనుంది. అయితే ఖాతాదారులు పీఫ్ బ్యాలెన్స్ని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటగా ఈపీఎఫ్ వో వెబ్ సైట్ epfindia.gov.in లో ఓపెన్ చేసి ఈ పాస్బుక్పై క్లిక్ చేయాలి. దీంతో passbook.epfindia.gov.in అనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. ఆ తర్వాత సభ్యుల ఐడీని ఎంచుకుని ఈపీఎఫ్ బ్యాలెన్స్ ని చూడవచ్చు .
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.