EPFO decision on interest
EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వారలోనే ఖాతాదారులకు శుభవార్త చెప్పనుంది. ప్రతిసారి వడ్డీ జమ ఆలస్యమవుతూ వస్తోంది. కానీ.. ఈ సంవత్సరం ముందుగానే పీఫ్ ఖాతాదారుల అకౌంట్లో వడ్డీ జమ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు దేశంలో ఏడు కోట్లకు పైగా ఎంప్లాయీస్ ఖాతాల్లో వడ్డీ అమౌంట్ జమ కానుంది. అయితే గతంలో వడ్డీ 8.5 శాతం అందించగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశమై వడ్డీ 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వడ్డీని ఖతాదారుల అకౌంట్లలో ఈ సారి ముందుగానే జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే గతంలో కంటే ఈ సారి వడ్డీ శాతాన్ని తగ్గించారు.
2012-13 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం వడ్డీ చెల్లించారు. 2016-17 సంవత్సరంలో 8.65 శాతం, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.55 శాతం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం చొప్పున వడ్డీ జమ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి మాత్రం 8.1 శాతానికి కుదించి వడ్డీ జమ చేయనుంది.కాగా ఈపీఎఫ్ వో ఉద్యోగుల ఖాతాల్లో జూన్ 16 నుంచి డబ్బు జమ చేయడం ప్రారంభించనుంది.
Good news for EPF clients Interest Amount
ప్రతిరోజు 2.5 నుంచి 5 లక్షల మంది ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.72,000 వేల కోట్ల వడ్డీని జమ చేయనుంది. అయితే ఖాతాదారులు పీఫ్ బ్యాలెన్స్ని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటగా ఈపీఎఫ్ వో వెబ్ సైట్ epfindia.gov.in లో ఓపెన్ చేసి ఈ పాస్బుక్పై క్లిక్ చేయాలి. దీంతో passbook.epfindia.gov.in అనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. ఆ తర్వాత సభ్యుల ఐడీని ఎంచుకుని ఈపీఎఫ్ బ్యాలెన్స్ ని చూడవచ్చు .
Keerthy Suresh : అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, అద్భుతమైన…
Coffee : ఈరోజు కూడా రొటీన్ గా ఒకే రకమైన కాఫీని తాగుతూ ఉంటారు. రొటీన్ కాఫీ తాగి బోర్…
KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కమిషన్…
Viral Video : ఝార్ఖండ్లోని దేవగఢ్ జిల్లాలోని బ్రాంసోలి గ్రామానికి చెందిన మున్నా సింగ్కు మూగజీవాలంటే ఎంతో అభిమానం. జంతువులు,…
Dwcra Women : ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాల మహిళలకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు తెలిపింది. డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా…
kavitha KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగిన సంగతి తెలిసిందే.…
Singer Mangli : ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ పుట్టినరోజు వేడుకలు చిక్కుల్లోకి తెచ్చాయి. మంగళవారం…
Central Bank of India : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత…
This website uses cookies.