EPFO : ఈపీఎఫ్ వో ఖాతాదారుల‌కి గుడ్ న్యూస్.. 16 నుంచి ఖాతాల్లోకి వ‌డ్డీ అమౌంట్..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

EPFO : ఈపీఎఫ్ వో ఖాతాదారుల‌కి గుడ్ న్యూస్.. 16 నుంచి ఖాతాల్లోకి వ‌డ్డీ అమౌంట్..!!

EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వార‌లోనే ఖాతాదారుల‌కు శుభ‌వార్త చెప్ప‌నుంది. ప్ర‌తిసారి వ‌డ్డీ జ‌మ ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. కానీ.. ఈ సంవ‌త్స‌రం ముందుగానే పీఫ్ ఖాతాదారుల అకౌంట్లో వ‌డ్డీ జ‌మ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు దేశంలో ఏడు కోట్ల‌కు పైగా ఎంప్లాయీస్ ఖాతాల్లో వ‌డ్డీ అమౌంట్ జ‌మ కానుంది. అయితే గ‌తంలో వ‌డ్డీ 8.5 శాతం అందించ‌గా 2021-22 ఆర్థిక సంవ‌త్సరానికి గాను ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ స‌మావేశ‌మై వ‌డ్డీ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :16 June 2022,6:00 pm

EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వార‌లోనే ఖాతాదారుల‌కు శుభ‌వార్త చెప్ప‌నుంది. ప్ర‌తిసారి వ‌డ్డీ జ‌మ ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. కానీ.. ఈ సంవ‌త్స‌రం ముందుగానే పీఫ్ ఖాతాదారుల అకౌంట్లో వ‌డ్డీ జ‌మ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు దేశంలో ఏడు కోట్ల‌కు పైగా ఎంప్లాయీస్ ఖాతాల్లో వ‌డ్డీ అమౌంట్ జ‌మ కానుంది. అయితే గ‌తంలో వ‌డ్డీ 8.5 శాతం అందించ‌గా 2021-22 ఆర్థిక సంవ‌త్సరానికి గాను ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ స‌మావేశ‌మై వ‌డ్డీ 8.1 శాతానికి త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఈ వ‌డ్డీని ఖ‌తాదారుల అకౌంట్ల‌లో ఈ సారి ముందుగానే జ‌మ చేయ‌డానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే గ‌తంలో కంటే ఈ సారి వ‌డ్డీ శాతాన్ని త‌గ్గించారు.

2012-13 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం వ‌డ్డీ చెల్లించారు. 2016-17 సంవత్సరంలో 8.65 శాతం, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.55 శాతం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం చొప్పున వడ్డీ జ‌మ చేసింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి మాత్రం 8.1 శాతానికి కుదించి వ‌డ్డీ జ‌మ చేయ‌నుంది.కాగా ఈపీఎఫ్ వో ఉద్యోగుల ఖాతాల్లో జూన్ 16 నుంచి డబ్బు జమ చేయ‌డం ప్రారంభించ‌నుంది.

Good news for EPF clients Interest Amount

Good news for EPF clients Interest Amount

EPFO : రోజూ ఎన్ని ల‌క్ష‌ల ఖాతాదారుల్లో అంటే..

ప్రతిరోజు 2.5 నుంచి 5 లక్షల మంది ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.72,000 వేల కోట్ల‌ వడ్డీని జమ చేయ‌నుంది. అయితే ఖాతాదారులు పీఫ్‌ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొద‌ట‌గా ఈపీఎఫ్ వో వెబ్ సైట్ epfindia.gov.in లో ఓపెన్ చేసి ఈ పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి. దీంతో passbook.epfindia.gov.in అనే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్క‌డ యూఏఎన్ నంబ‌ర్, పాస్ వ‌ర్డ్, క్యాప్చా ఎంట‌ర్ చేసి క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత స‌భ్యుల ఐడీని ఎంచుకుని ఈపీఎఫ్ బ్యాలెన్స్ ని చూడ‌వ‌చ్చు .

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది